రాయలసీమలో జగన్ ను ఓడించే సత్తా కాంగ్రెస్ కు ఉందా. ఆ 52 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఏం చేస్తోంది. నేరుగా ఓడిం చలేక..టిడిపికి సహకరిస్తోందా. కాంగ్రెస్ ఆలోచ న ఏంటి. జగన్ గెలుపును ఎలాగైనా అడ్డుకొకోవాలని తపిస్తున్న కాంగ్రెస్ వ్యూహం ఏంటి. ఏపిలో అధికార పార్టీ పై అసంతృ ప్తి పెరిగి వైసిపికి ఆదరణ పెరుగుతోందని కాంగ్రెస్ గుర్తించింది.
జగన్ ను అధికారం ఖాయమనే అంచనాకు వచ్చింది. అ యితే, జగన్ కు అధికారం దక్కటం కాంగ్రెస్ అగ్రనాయకత్వానికి ఇష్టం లేదు. పార్టీ సమావేశాల్లోనే ఓపెన్ గానే ఈ విషయాన్ని చెబుతూ వస్తోంది. జగన్ బలంగా ఉన్న రాయలసీమ లో 52 నియోజకవర్గాల పై కాంగ్రెస్ దృష్టి పెట్టింది. అక్కడ జగన్ అనుకూల ఓటు అడ్డుకోలేమని గ్రహించిన కాంగ్రెస్ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చటానికి వ్యూహాలు సిద్దం చేస్తోంది. అందులో భాగంగా ఇప్పటికే 30 నియోజకవర్గాలను ఎంచుకున్నట్లు సమాచారం. ఈ 30 నియోజకవర్గాల్లో సామాజిక సమీకరణాలను దృష్టిలో పెట్టుకొని ఆర్దికంగా కొంత పేరున్న బలమైన అభ్యర్ధులను రంగంలోకి దించాలని కాంగ్రెస్ నేతలు ఒక ఫార్ములా సిద్దం చేసినట్లు సమాచారం.
గత ఎన్నికల్లోనూ రాయలసీమ లో అనంతపురం మినహా మిగిలిన మూడు జిల్లాలు నెల్లూరు లో వైసిపి అధిక్యం సాధించింది. ఇప్పుడు అనంత లోనూ పరిస్థితులు వైసిపికి అనుకూలంగా ఉన్నాయి. దీంతో రాయలసీమల లో 30 అసెంబ్లీ స్థానాల్లో ఓట్లను చీల్చటం తద్వారా వైసిపి గెలిచే స్థానాలపై ప్రభావం చూపటం ప్రస్తుతం కాంగ్రెస్ లక్ష్యమని ఆ పార్టీ ముఖ్య నేతలు స్పష్టం చేస్తు న్నారు. ఇక, కోస్తాంధ్ర జిల్లాల్లో టిడిపి వ్యతిరేక ఓటు జనసేన చీల్చుతుందని అంచనా వేస్తున్నారు.
రాయలసీమ లో ఓట్ల చీలకే లక్ష్యంగా కాంగ్రెస్ పని చేయనుంది. టిడిపికి పరోక్షంగా సహకరించటమే ఇందులో ప్రధాన ఉద్దేశం. పిసిసి అధ్యక్షు డు రఘువీరారెడ్డి సైతం కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ లో రీ ఎంట్రీ సమయంలో దాదాపు ఇదే సంకేతాలిచ్చారు. అయితే, కాంగ్రెస్ జగన్ విజయాన్ని అడ్డుకొంటూ టిడిపికి సహకరించాలనే ఉద్దేశంతో వేస్తున్న ఎత్తుగడలు ప్రయత్నాలు జగన్ ను నిలువరించగలవా అనేదే అసలు ప్రశ్న. పాదయాత్ర ద్వారా పూర్తిగా ప్రజల్లోనే ఉంటూ వారికి దగ్గరగా ఉన్న జగన్ ను రా జకీయంగా నేరుగా ఎదుర్కోలేక ఇటువంటి తెర చాటు యత్నాలను మొదలు పెట్టింద. మరి జగన్ లక్ష్యంగా సాగుతున్న ఈ రాజకీయ కుట్రలు ఫలిస్తాయా జగన్ ను దెబ్బతీస్తాయా మరి జగన్ ఎలా ఎదుర్కొంటారు..