Home Blog Page 2

చలించిపోయిన జగన్ ..రూ. 15 లక్షల సాయం

0

జగన్మోహన్ రెడ్డి తన పెద్ద మనసును చాటుకున్నారు. తమ సోదరుడికి ప్రాణబిక్ష పెట్టమని కోరుకుంటున్న ఇద్దరు చిన్నారుల విజ్ఞప్తికిజగన్ చలించిపోయారు. వెంటనే రూ. 15 లక్షలు మంజూరు చేయాలని సిఎంవో అధికారులను ఆదేశించారు. జగన్ ఔదార్యంతో బాధితుని కుటుంబసభ్యులు, దగ్గర బంధువులు, స్నేహితులు హ్యాపీగా ఫీలవుతున్నారు.

ఇంతకీ విషయం ఏమిటంటే శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో పాల్గొనేందుకు జగన్ తిరుమలకు వస్తున్న విషయం ఇద్దరు చిన్నారులు తెలుసుకున్నారు. వాళ్ళ సొంతూరైన చంద్రగిరి నుండి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. విమనాశ్రయం లాంజిలోజగన్ కు కనబడేట్లుగా చిన్నారులతో పాటు తల్లి, దండ్రులు కూడా ప్ల కార్డులు పట్టుకుని నిలబడ్డారు.

వాళ్ళని చూడగానేజగన్ స్వయంగా వాళ్ళ దగ్గరకు వెళ్ళారు. వాళ్ళ చెప్పిన విషయం ఏమిటంటే 10వ తరగతి చదువుతున్న వాళ్ళ సోదరుడు హరికృష్ణ 2015లో ఓ స్కూలు భవనంపై నుండి సిబ్బంది క్రిందకు తోసేశారు. వెంటనే ఆసుపత్రిలో చేర్పించినా కోమాలోకి వెళ్ళిపోయాడని వైద్యులు చెప్పారు.

చెన్నై ఆసుపత్రిలో తొమ్మిది ఆపరేషన్లు చేసినా ఉపమోగం కనబడలేదు. దాదాపు మూడు సంవత్సరాల పాటు కోమాలోనే ఉన్న హరికృష్ణ ఈ మధ్యనే స్పృహలోకి వచ్చాడు. అయితే మంచానికే అతుక్కుపోయాడు. హరికృష్ణ మామూలుగా లేచి నిలబడాలంటే మరో శస్త్రచికిత్స చేయాలని అందుకు 10 లక్షల రూపాయలవుతుందని డాక్టర్లు చెప్పారట. దాంతో అంత స్తోమత లేని కుటుంబసభ్యులు జగన్ సాయాన్ని అర్ధించారు.

ఎయిర్ పోర్టులో వీళ్ళతో మాట్లాడి సమస్యను విన్న వెంటనేజగన్ హరికృష్ణ శస్త్రచికిత్స కోసం రూ. 10 లక్షలు మంజూరు చేయాలంటూ ఆదేశించారు. అలాగే చిన్నారుల చదువుల కోసం మరో రూ. 5 లక్షలు కూడా మంజూరు చేశారు. ఎప్పుడైతే తమ బాధను విన్న జగన్ వెంటనే స్పందించారని తెలిసిందో హరికృష్ణ కుటుంబ సభ్యులకు ఆనందంతో కన్నీళ్ళు ఆగలేదు. మొన్నటికి మొన్న విశాఖపట్నంలో కూడా ఓ క్యాన్సర్ బాధితుడి ఆపరేషన్ కోసం జగన్ రూ. 25 లక్షలు మంజూరు చేసిన విషయం గుర్తుండే ఉంటుంది.

దేశంలోనే తొలిసారిగా గ్రామ సచివాలయాలు

0

అధికారం చేపట్టిన కేవలం నాలుగు నెలలు పూర్తికాక ముందే ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం అక్షరాలా లక్ష ముప్పై వేల శాశ్వత ఉద్యోగాలు కల్పించి రికార్డ్ సృష్టించారు. దేశంలో మరెక్కడా లేని విధంగా గ్రామ సచివాలయ వ్యవస్థను తీసుకువచ్చి ప్రజలకు పరిపాలనను చేరువ చేస్తున్నారు. మే 30న ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో ఆయన ఇచ్చిన హామీని నెరవేరుస్తూ ఈ గ్రామ సచివాలయాలు ఏర్పాటుకు పూనుకున్నారు. అతి తక్కువ సమయంలో లక్ష ముప్పై వేల ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానించడంతో పాటు నియామక ప్రక్రియ పూర్తిచేశారు. నియామక పత్రాలు అందుకున్న గ్రామ వాలంటీర్లు అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా విధుల్లో చేరనున్నారు.

ఎన్నికల సభల్లో సీఎం జగన్ హామీ ఇచ్చిన విధంగా తొమ్మిది ప్రాధాన్యత అంశాలను నవరత్నాల పేరుతో మానిఫెస్టోలో చేర్చారు. వాటిని నవరత్నాలు అని పిలుస్తున్నారు. వీటిని పకడ్బందీగా అమలు చేయడానికి – ప్రతి లబ్ధిదారుడికి పథకాలు అందేందుకు గ్రామా వాలంటీర్లు కీలకం కానున్నారు. ఇందుకోసం ప్రభుత్వం భారీ ఎత్తున నియామకాలు చేపట్టింది. దాదాపు 20 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా – 8 రోజులపాటు పరీక్షలు నిర్వహించారు. మొత్తం 1.30 లక్షల మందికి శాశ్వత ఉద్యోగాలు లభించాయి. తద్వారా ప్రతి గ్రామంలో 10 నుంచి 12 మందికి ఉద్యోగాలు లభించాయి. ఇంత భారీ ఎత్తున ఉద్యోగాలు కల్పించడం దేశ చరిత్రలోనే ఒక రికార్డ్.

50 ఇళ్లకు ఒక వాలంటీర్:

వ్యవస్థలో మార్పు తీసుకువచ్చేందుకే గ్రామ – వార్డు సచివాలయాలు తీసుకువచ్చారు. 50 ఇళ్లకు ఒక వాలంటీర్ ఉంటారు. వివక్ష – కుల మాత విభేదాలు లేకుండా అవినీతికి ఎలాంటి ఆస్కారం లేకుండా 72 గంటల్లో గ్రామ వాలంటీర్లు సేవలు అందిస్తారు. 34 డిపార్టుమెంట్లకు సంబందించిన పనులు గ్రామ సచివాలయాల ద్వారా జరుగుతాయి. పారదర్శకతతో అందరికి సంక్షేమ పథకాలు అందించడమే ఈ వ్యవస్థ ముఖ్య లక్ష్యం. నవరత్నాలతో పాటు మేనిఫేస్టోలో చెప్పిన అంశాలను పటిష్టంగా అమలు చేయాలని ముఖ్యమంత్రి జగన్ ఇప్పటికే నిర్ణయం తీసుకోవడంతో గ్రామ సచివాలయాల పనితీరుపై తాడేపల్లి సీఎం క్యాంపు ఆఫీస్ నుండే పరిశీలించనున్నారు. ప్రతి సచివాలయంలో పదకొండు నుంచి పన్నెండు మంది ఉద్యోగులు పనిచేస్తారని రాష్ట్ర వ్యాప్తంగా 126728 ఉద్యోగులతో కొత్త వ్యవస్థను సృష్టించడం వల్ల ప్రభుత్వ పథకాలు అర్హులకు ఇంటింటికీ చేరేలా పకడ్బంధీంగా జగన్ ప్రభుత్వం ముందుకు వెళుతోంది. అందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 11158 గ్రామ సచివాలయాలు – 3786 వార్డు సచివాలయాలు గాంధీ జయంతి నాటి నుంచి ప్రారంభమవుతున్నాయి.

చంద్రబాబు అక్కసు:

ఒకప్పుడు జన్మభూమి కమిటీల ద్వారా విపరీతమైన అవినీతికి పాల్పడ్డ తెలుగు దేశం నేతలు…జన్మభూమి కమిటీల ఆగడాలకు అంతే లేకుండా పోయింది. అధికారం పోయినప్పటికీ చంద్రబాబు నైజం మారలేదు. ప్రభుత్వం ఒకవైపు గ్రామ వలంటీర్ల వ్యవస్థను సృష్టించి లక్షా 26వేల మందికిపైగా ఉద్యోగాలు ఇవ్వడాన్ని జీర్ణించుకోలేని టిడిపి అధినేత చంద్రబాబు ప్రతీనిమిషం తన అక్కసును వెళ్లగక్కుతూనే ఉన్నారు. ఇంట్లో మగవాళ్లు లేనప్పుడు గ్రామ వాలంటీర్లు వెళ్లి డోర్లు కొడతారు అంటూ స్థాయిని తగ్గించుకొని వ్యాఖ్యలు చేశారు. దీంతో మాజీ ముఖ్యమంత్రి నోటి తీరుపై ప్రజల్లో వ్యతిరేకత ఏర్పడుతోంది. చంద్రబాబు అయిదేళ్లు అధికారంలో ఉన్న సమయంలో నిరుద్యోగ భృతి – ఇంటికో ఉద్యోగం లాంటి హామీలను నెరవేర్చడంలో విఫలమైంది.

అయిదేళ్ల అధికారంలో నిరుద్యోగ భృతి ఇవ్వకుండా – ఉద్యోగ కల్పన చేయకుండా చేతులెత్తేసిన చంద్రబాబు గ్రామ వలంటీర్ల వ్యక్తిత్వాలను కించపరుస్తూ మాట్లాడడం మహిళల శీలాలను శంకించే విధంగా దూషించడం మాజీ ముఖ్యమంత్రి రాజకీయ దుస్థితికి అద్దం పడుతోంది. అలాంటి చంద్రబాబు మహిళలను – గ్రామ వాలంటీర్లను కించపరుస్తూ మాట్లాడటం ఆయన దిగజారుడు తనానికి నిదర్శనం. అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోనే జగన్ మోహన్రెడ్డి ప్రభుత్వం లక్షా 25 వేలకు పైగా ఉద్యోగాలు ఇవ్వడంతో దిక్కుతోచని స్థితిలో చంద్రబాబు బృందం కారుకూతలు కూస్తున్నారు.

ఒకవేళ పేపర్ లీకేజ్ అంటూ తప్పుడు ప్రచారాలను మొదలు పెట్టింది. నిజంగానే లీక్ అయ్యుంటే అది పరీక్షా జరిగిన రోజే బట్టబయలు అవుతుంది. ప్రజల్లో కూడా దానిపై వ్యతిరేకత ఆందోళన మొదలవుతాయి. ఫలితాలు వచ్చాక తన జాతి మీడియాతో చంద్రబాబు రాయించిన – కూయించిన పచ్చ పబ్లిసిటీ పనులు విజయవంతం కాలేదు. దీంతో గ్రామవాలంటీర్లు – సచివాలయ సిబ్బందిపై చంద్రబాబు అండ్ కో భవిష్యత్తులో ఎన్ని నిందలు వేయడానికైనా వెనుకాడరు. దేశంలో ఏ కొత్త విధానం/వ్యవస్థనైనా ప్రజలు అలవాటు పడడానికి కొంత సమయం పడుతుంది. అలాగే గ్రామ సచివాలయ – వలంటీర్ల పనితీరు ఫలితాలు రావడానికి కూడా ఖచ్చితంగా కొంత సమయం పడుతుంది. ప్రజలు ఆశీర్వదించి సొంతం చేసుకుంటే గాంధీజీ చెప్పిన గ్రామ స్వరాజ్యం ఆంధ్రప్రదేశ్ నుంచే ప్రారంభమై దేశ వ్యాప్తంగా అమలు అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

అచ్చెన్నాయుడుకు హైకోర్టు నోటీసులు

0
అచ్చెన్నాయుడుకు హైకోర్టు నోటీసులు

ఫైర్ బ్రాండ్ – టీడీపీకి చెందిన సీనియర్ నేత – టెక్కలి ఎమ్మెల్యే కింజారపు అచ్చెన్నాయుడుకు హైకోర్టు షాకిచ్చింది. దీంతో ఆయన చిక్కుల్లో పడ్డారు. టెక్కలిలో ఎమ్మెల్యేగా గెలిచిన అచ్చెన్నాయుడు ఎన్నికను రద్దు చేయాలని కోరుతూ ఆయన చేతిలో ఓడిపోయిన వైసీపీ అభ్యర్థి పేరాడ తిలక్ హైకోర్టులో పిటీషన్ వేసిన సంగతి తెలిసిందే. దీనిపై స్పందించిన హైకోర్టు తాజాగా అచ్చెన్నాయుడు ఎన్నికలో లూప్ హోల్స్ ఉన్నాయని గ్రహించి ఈ పిటీషన్ ను అనుమతించింది.

తాజాగా హైకోర్టు అచ్చెన్నాయుడితోపాటు పలువురికి నోటీసులు జారీ చేసింది. అక్టోబర్ 17లోగా సమాధానం చెప్పాలని ఆదేశాలిచ్చింది. కాంగ్రెస్ – బీజేపీ – జనసేన – ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థులతోపాటు టెక్కలి రిటర్నింగ్ అధికారికి హైకోర్టు నోటీసులు పంపింది.

అచ్చెన్నాయుడు టెక్కలి నుంచి పోటీచేసినప్పుడు అఫిడవిట్ లో తనపై నమోదైన క్రిమినల్ కేసు వివరాలను పేర్కొనలేదని.. ఆయన ఎన్నిక చెల్లదంటూ వైసీపీ అభ్యర్థిగా పోటీచేసి ఓడిన తిలక్ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. 2017 – జులై 21న అనంతపురం జిల్లా హీరేహల్ లో క్రిమనల్ కేసు నమోదైందని ఆధారాలు అందజేశారు. అచ్చెన్నపై అనర్హత వేటు వేయాలని వైసీపీ అభ్యర్థి కోరడంతో ఆయన ఎన్నిక వివాదం రాజుకుంది

చంద్రబాబుకు మరో ఘోర పరాభవం తప్పదా..!

0

చంద్రబాబు హుజూర్ నగర్ ఉపఎన్నిక పోరులో టీడీపీ తరుపున అభ్యర్ధిని నిలిపి మరో ఘోర ప్రభావానికి సిద్ధమవుతున్నారా? అంటే అవుననే అనిపిస్తోంది. ప్రస్తుతం తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అక్కడ టీడీపీలో పట్టుమని పదిమంది నాయకులు కూడా లేరు. 2014 తర్వాత చాలామంది టీఆర్ఎస్ లో చేరిపోతే, కొందరు కాంగ్రెస్ లో చేరిపోయారు. ఇక ఆ పార్టీ కేడర్ గానీ, ఓటు బ్యాంక్ గానీ ఎక్కువ శాతం టీఆర్ఎస్ వైపు వెళ్లిపోయింది.

దీంతో తెలంగాణలో అడ్రెస్ లేకుండా పోయింది. ఈ తరుణంలోనే 2018 అసెంబ్లీ ఎన్నికలు వచ్చాయి. ఈ ఎన్నికల్లో చరిత్రలో బద్ద శత్రువైన కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుని ఎన్నికల్లో పోటీ చేసింది. పొత్తులో భాగంగా 13 సీట్లలో పోటీ చేసి 2 స్థానాల్లో గెలిచి ఘోర పరాభవం పొందింది. ఆఖరికి నందమూరి ఫ్యామిలీ నుంచి హరికృష్ణ తనయ సుహాసిని కూడా కూకట్ పల్లి బరిలో నిలిచి ఓటమి పాలైంది. అప్పుడు కేవలం చంద్రబాబు చేసిన రాజకీయాలకే ఆమె బలైపోయిందని ప్రచారం కూడా జరిగింది.

ఈ దెబ్బతో సైలెంట్ అయిపోయిన చంద్రబాబు మొన్న జరిగిన లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణలో పోటీకి దిగలేదు. ఈ సమయంలోనే ఏపీలో టీడీపీ ఘోరంగా ఓడిపోయింది. దీంతో అటు ఏపీలో, ఇటు తెలంగాణలోని నేతలు తమ దారి తాము చూసుకున్నారు. ముఖ్యంగా తెలంగాణలో అక్కడక్కడ మిగిలిన నేతలు బీజేపీలోకి జంప్ అయిపోయారు. అయితే ఇన్ని పరాభవాలు ఎదురైన చంద్రబాబు వెనక్కి తగ్గకుండా మరో పరాభవానికి సిద్ధమయ్యారు. హుజూర్ నగర్ బరిలో టీడీపీ అభ్యర్ధిని బరిలోకి దించారు.

అసలు గెలవరని తెలిసి కూడా చంద్రబాబు ఎందుకు పోటీకి దింపారని రాజకీయ విశ్లేషుకులు షాక్ అవుతున్నారు. అసలు ఇక్కడ టీఆర్ఎస్, కాంగ్రెస్ ల మధ్యే ప్రధాన పోటీ ఉంది. ఆరు నూరైన టీడీపీ గెలిచే ప్రసక్తి లేదు. మరి ఇలాంటి పరిస్థితుల్లో టీడీపీని ఎందుకు బరిలోకి దించారో ఎవరికి అర్ధం కావడం లేదు. ఏది ఏమైనా చంద్రబాబు మరో ఘోర పరాభవానికి సిద్ధమైనట్లే కనిపిస్తోంది.

విద్యా శాఖలోనూ రివర్స్ టెండరింగ్ : రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్

0

రాష్ట్రంలో గత ప్రభుత్వం నిధులను దోచుకున్నదని ఇప్పుడు రివర్స్ టెండరింగ్ ద్వారా నిధుల ఖర్చు తగ్గిస్తున్నామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ అన్నారు. సోమవారం మార్కాపురం డివిజన్ లోని సచివాలయ ఉద్యోగులుగా ఎంపికయిన వారికి నియామకపు పత్రాలు అందజేశారు. స్థానిక మార్కెట్ యార్డ్ లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన మంత్రి సురేష్ మాట్లాడారు. ఈ క్రమంలోనే విద్యాశాఖలో కూడా రివర్స్ టెండరింగ్ విధానాన్ని అమలు చేస్తామని మంత్రి అన్నారు. దీని ద్వారా ఖర్చు తగ్గిస్తామని ప్రభుత్వ నిధులను కాపాడతామన్నారు. ఇప్పటికే విద్యాశాఖ లో పలు సంస్కరణలకు తెర తీశామన్నారు.

ఇంకా పలు సంస్కరణలతో విద్యాశాఖను పటిష్ఠపరుస్తామని స్పష్టం చేశారు. గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యానికి అడుగులు పడ్డాయని, అందులో భాగంగానే రాష్ట్రం లో సచివాలయాలు ఏర్పాటు అవుతున్నాయని మంత్రి డాక్టర్ ఆదిమూలపు అన్నారు. గ్రామ సచివాలయాల ద్వారా ప్రజలకు సకాలంలో సేవలు అందనున్నాయని చెప్పారు. సీఎం జగన్ పాదయాత్రలో ప్రజల కష్టాలను చూసి 72 గంటల్లో ప్రజల సమస్యలకు పరిస్కారం చూపాలనే లక్ష్యంతో ఈ సచివాలయాలు ఏర్పడ్డాయన్నారు. అందులో పనిచేసెందుకు స్థానిక యువతకు అవకాశం ఇస్తానని పాదయాత్ర లో ఇచ్చిన హామీల అమలు నెరవేర్చి నాలుగు నెలల్లోనే 4లక్షల ఉద్యోగాలు ఇచ్చి రికార్డు సృష్టించారన్నారు.

గత ప్రభుత్వ హయాంలో జన్మభూమి కమిటీ పేరుతో స్థానిక సంస్థలను నిర్విర్యం చేసారని, ఇప్పుడు మీరు జగనన్న ఆశయ సాధనకు అవినీతి కి తావు లేకుండా పని చేయాలని ఉద్యోగులను ఉద్దేశించి అన్నారు. పార్టీ, కులం, మతం చూడకుండా కేవలం అర్హత మాత్రమే చూసి ప్రభుత్వ పధకాలు ప్రజలకు అందించాలని కోరారు. రాజకీయాలకు తలొగ్గకుండా పని చేయటం ఉద్యోగులకు ఇబ్బందే అయినా ప్రభుత్వ పథకాలు అందించే విషయంలో మాత్రం కేవలం అర్హత మాత్రమే చూడాలని ఇతర ఏ సిఫారసు, పార్టీలు చూడవద్దని సూచించారు. అమ్మవడి కార్యక్రమం ద్వారా 6, 456 కోట్లు తల్లుల ఖాతాలకు ఇస్తున్నామని, ఇందులో పార్టీలు చూడకుండా పిల్లలను బడికి పంపే ప్రతి తల్లికి ఏటా నిధులు ఇస్తామన్నారు. లక్షలాది మందికి ఉద్యోగాలు ఇస్తుంటే ఓర్వలేని ప్రతిపక్ష పార్టీ నాయకులు అక్రమాలు జరిగాయని చెప్పటం మంచి పద్ధతి కాదన్నారు. ఈ ఉద్యోగాల్లో మంత్రులు కానీ ఎమ్మెల్యే లు కానీ ఎవరికయినా సిఫారసు లేఖలు ఇచ్చినట్లు నిరూపించగలరా అని ప్రశ్నించారు.

గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు మాట్లాడుతూ ప్రభుత్వ పధకాలు అర్హులకు అందజేయాలని, జగనన్న చేపట్టిన పాలన రాజన్న రాజ్యం స్థాపన కోసమన్నారు. ఉద్యోగాలు పొందినవారు ఎక్కడ పోస్టింగ్ ఇచ్చినా పనిచేయాలని, తమకు ఫలానా చోట పోస్టింగ్ కావాలని మరలా మా వద్దకు సిఫారసు కోసం రాకూడదన్నారు. మార్కాపురం ఎమ్మెల్యే నాగార్జునరెడ్డి మాట్లాడుతూ రెవిన్యూలో భూముల సర్వే సమస్య ఇప్పటి వరకు జటిలంగా ఉందనన్నారు. ఈ ఉద్యోగాల ద్వారా వచ్చిన సర్వేయర్ లు ఆయా సమస్యలను పరిష్కరిస్తారని ఆశిస్తున్నట్లు చెప్పారు. అనంతరం నియామకపు పత్రాలను మంత్రి సురేష్ అందజేశారు. ఉద్యోగులకు పత్రాలు పంపిణీ చేసే స్టాళ్ళ వద్దకు వెళ్లి వారికి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో స్పెషల్ కలెక్టర్ గంగాధర్ గౌడ్, ఆర్ డివో శేసిరెడ్డి, జే డి రామచంద్రమూర్తి, డీడి లక్ష్మీసుధ, ఇతర అధికారులు పాల్గొన్నారు.

రేపు తూ.గో.లో సీఎం జగన్ పర్యటన… గ్రామ సచివాలయం ప్రారంభం

0

గాంధీజీ జయంతి రోజున ఏపీ సీఎం వైఎస్ జగన్ కొన్ని కీలక కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నారు. ఇందుకోసం ఆయన తూర్పు గోదావరి జిల్లా పర్యటనకు వెళ్తున్నారు. సోమవారం తిరుమల శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించిన ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి… రేపు తూర్పుగోదావరి జిల్లా పర్యటనకు వెళ్తున్నారు. అక్కడి కరపలో గ్రామ సచివాలయం ప్రారంభిస్తారు. ఇందుకోసం బుధవారం మధ్యాహ్నం 1 గంటకు… సీఎం జగన్… గుంటూరులోని తాడేపల్లిలో ఉన్న తన ఇంటి నుంచీ బయల్దేరి… తూర్పుగోదావరి జిల్లా… కాకినాడ దగ్గర్లో ఉన్న కరప గ్రామానికి చేరతారు. అక్కడ గ్రామ సచివాలయం పైలాన్ ఆవిష్కరిస్తారు. తర్వాత అక్కడి హైస్కూల్ దగ్గర ఏర్పాటు చేసే స్టాల్స్‌ని అలా అలా చూస్తారు. ఆ తర్వాత అక్కడి బహిరంగ సభలో మాట్లాడతారు.

ప్రభుత్వం గ్రామ సచివాలయం ద్వారా ఏం చేయబోతోందో చెబుతారు. నెక్ట్స్… రాజమండ్రి ఎయిర్‌పోర్ట్‌కి వెళ్లి… వైజాగ్‌లో జరిగే… కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి కొడుకు క్రాంతికుమార్ పెళ్లికి వెళ్తారు. అదే రోజు రాత్రి మళ్లీ తాడేపల్లికి వెళ్లిపోతారు. ఇలా ప్రభుత్వం షెడ్యూల్ రెడీ చేసుకుంది. అక్టోబర్ 4న జగన్ వెళ్లబోయే పశ్చిమ గోదావరి జిల్లాలోని ఏలూరు పర్యటన కూడా ఫైనలైజ్ అయ్యింది. 4 తర్వాత… 5న ఆయన విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకుంటారు. ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు, ఇతరత్రా సమర్పిస్తారు. ఇలా నెక్ట్స్ 5 రోజుల వరకూ సీఎం జగన్ షెడ్యూల్ ఫిక్స్ చేశారు.

గ్రామ సచివాలయం ఎందుకు : గ్రామ స్వరాజ్యం రావాలన్నది బాపూజీ కల. అందులో భాగంగానే ఉర్లోకే ప్రభుత్వ సేవలు అందుబాటులోకి తెచ్చేందుకు గ్రామ సచివాలయం అనే వ్యవస్థను తెస్తోంది ఏపీ ప్రభుత్వం. అక్టోబర్ 2న గ్రామ, వార్డు సచివాలయాలు రాష్ట్రవ్యాప్తంగా ఓపెన్ అవుతాయి. ఇందుకు సంబంధించి సీఎం జగన్ సోమవారం… గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల అపాయింట్‌మెంట్ లెటర్స్‌ని సోమవారం విజయవాడలో 5000 మందికి ఇచ్చారు. జిల్లాల్లో కూడా నియామక పత్రాల జారీ జరిగింది. మొత్తం 13,065 గ్రామ పంచాయతీలను 11,158 గ్రామ సచివాలయాలు మార్చేస్తున్నారు.

ఇకపై ప్రజల సమస్యలన్నీ గ్రామ, వార్డ్ సచివాలయం ద్వారా పరిష్కారమవుతాయి. ప్రజలు సమస్య చెప్పిన 72 గంటల్లోనే సెటిల్ అవుతాయి. ప్రధానంగా ఈ వ్యవస్థ ద్వారా ప్రజలకు, విద్యార్థులకు అవసరమైన వివిధ సర్టిఫికెట్లు వెంటనే వస్తాయి. గ్రామాల్లో రైతుల సమస్యలు, మురుగునీటి పారుదల, ఆరోగ్యం, మంటి నీటి సరఫరా, కరెంటు సరఫరా వంటి సేవల సమస్యలు చకచకా పరిష్కారం అవుతాయి. పింఛన్లు, రేషన్‌కార్డులు, రుణాల కార్డులను ఇక్కడే ఇస్తారు.

ప్రైవేట్ మద్యం బంద్.. ఇక సర్కారీ మందు

0
ప్రైవేట్ మద్యం బంద్.. ఇక సర్కారీ మందు

అప్పుడెప్పుడు 1995వ సంవత్సరంలో తెలుగుదేశం వ్యవస్థాపకులు ఎన్టీఆర్ ఆంధ్రప్రదేశ్ లో మద్యనిషేధం అమలు చేసినప్పుడు ఈ మద్యం అమ్మకాలు ఆగిపోయాయి. ప్రైవేటు వారి చేతుల్లో ఉన్న వైన్ షాపులు మొత్తంగా బంద్ అయిపోయాయి. మళ్లీ ఇన్నాళ్లకు వైఎస్ జగన్ సర్కారు వేస్తున్న మద్యపాన నిషేధం అడుగుల్లో భాగంగా ప్రైవేటు మద్యం షాపులు బంద్ అయ్యాయి. దశాబ్ధాల తర్వాత ఏపీలో ప్రైవేటు వైన్స్ ఈరోజుతో బంద్ అయిపోయి నేటి నుంచి సర్కారు మందు లభ్యం అవుతోంది..

సెప్టెంబర్ 30 అంటే నేటితో ప్రైవేట్ వైన్స్ అన్నీ బంద్ అయిపోతున్నారు. రేపటి నుంచి అక్టోబర్ 1 నుంచి సర్కారీ వైన్స్ ఏపీలో మొదలు కాబోతున్నాయి. మద్యం అమ్మకాల్లోనూ సమూల మార్పులు రానున్నాయి ఇప్పటికే ప్రైవేటు వైన్స్ వ్యాపారులు సరుకునంతా ఖాళీ చేస్తున్నారు. ఇక సర్కారీ వైన్స్ దుకాణాల్లో మద్యాన్ని నింపి సిబ్బందిని నియమించే పనులను ఎక్సైజ్ శాఖ వేగంగా చేపడుతోంది.

ప్రస్తుతం ఏపీలో 4800 ప్రైవేటు మద్యం షాపులు వ్యాపారుల చేతుల్లో ఉండగా.. ఇప్పుడు జగన్ సర్కారు మద్యనిషేధం దశలవారీగా అమలు చేస్తామని చెప్పిన నేపథ్యంలో ఆ సంఖ్యను ఇప్పుడు 20శాతం తగ్గించి 3448 ప్రభుత్వ మద్యం దుకాణాలకు పరిమితం చేస్తోంది. ఇప్పుడు అక్టోబర్ 1న 3200 వరకూ కొత్త సర్కారీ మద్యం షాపులు ప్రారంభం కాబోతున్నాయి.

అయితే కొత్త సర్కారీ వైన్స్ షాపుల్లో బీర్లు పెట్టడానికి ఫ్రిజ్ లు కొనుగోలు చేయలేదు. ఆర్థిక భారం కారణంగా వదిలేశారు. దీంతో చిల్ బీర్ లేని అమ్మకాలు పడిపోయే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. బీర్ ను ఇంటికి తీసుకెళ్లి కూలింగ్ పెట్టుకొని తాగే పరిస్థితి లేకపోవడంతో బీర్ ప్రియులు ఇబ్బందులు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. తాజాగా ఇప్పుడు సర్కారీ వైన్స్ బాధ్యతలను సీఐ ఎస్ఐలకు అప్పగిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

2014లోనే జగన్ సీఎం కావల్సింది: ఎందుకు కాలేదో చెప్పిన ఎంపీ సుజనా చౌదరి

0
2014లోనే జగన్ సీఎం కావల్సింది: ఎందుకు కాలేదో చెప్పిన ఎంపీ సుజనా చౌదరి

బీజేపీ ఎంపీ, మాజీ కేంద్ర మంత్రి సుజనా చౌదరి ఏపీ సీఎం వైఎస్ జగన్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2014 ఎన్నికల్లోనే జగన్ సీఎం కావాల్సింది అంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఓ మీడియా ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పాల్గొన్న సుజనా జగన్, చంద్రబాబుపై చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు కారణమవుతున్నాయి. 2014 ఎన్నికల్లోనే వైయస్ జగన్మోహన్ రెడ్డి సీఎం కావాల్సి ఉందని, జగన్ నేతృత్వంలోని వైఎస్సార్సీపీ అధికారంలోకి రావాల్సింది అని వ్యాఖ్యానించిన బిజెపి ఎంపీ సుజనాచౌదరి ఆ సమయంలో జగన్ సీఎం ఎందుకు కాలేదో వివరించారు.

2014వ సంవత్సరంలో ఎన్నికల సమయంలో జగన్ కు సానుకూలతలు కూడా ఎక్కువగా ఉన్నాయన్న ఆయన భారతీయ జనతా పార్టీ ఒకవైపు, మరోవైపు పవన్ కళ్యాణ్ టీడీపీకి సహకరించటం వల్లే జగన్ పార్టీ ఓటమి పాలైందని పేర్కొన్నారు. బిజెపి, పవన్ కళ్యాణ్ రూపంలో జగన్‌ పార్టీకి ఎదురు దెబ్బతగిలిందని చెప్పిన సుజనాచౌదరి అది టీడీపీకి కలిసొచ్చి జగన్ కు అధికారం దూరం అయిందన్నారు. ఇక సుజనా చౌదరి చేసిన వ్యాఖ్యలు బిజెపి, పవన్ కళ్యాణ్ సహకారం లేకుంటే టీడీపీ అధికారంలోకి వచ్చేది కాదు అన్న ధోరణి లో సాగింది. క్షేత్ర స్థాయిలో బలంగా ఉన్న టీడీపీకి నాడు బీజేపీ, పవన్ వలన అధికారం దక్కిందన్నారు సుజనా చౌదరి.

ఇక తాజాగా జరిగిన ఎన్నికల్లో బీజేపీని దూరం చేసుకోవడం, జనసేన పార్టీ స్వయంగా రంగంలోకి దిగటం తన వల్లే టీడీపీకి ఈ గతి పట్టిందన్నారు ఎంపీ సుజనా చౌదరి. ఒకవేళ ఈ ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించినా కూడా తాను టీడీపీలో ఉండే వాడిని కాదని, తాను భారతీయ జనతా పార్టీలో చేరేవాడినని సుజనా పేర్కొన్నారు. గతంలో సీఎంగా ఉన్న చంద్రబాబుకు బీజేపీతో వైరం అనర్ధాలు తెస్తుందని తాను ముందే చెప్పానని, అయినా ఆయన మాట వినిపించుకోలేదని సుజనా పేర్కొన్నారు.

బీజేపీతో టీడీపీ పొత్తు కొనసాగించాలని అనుకున్న వారిలో తానూ కూడా ఒకడినన్నారు సుజనా చౌదరి. ఇక ప్రధాని మోదీ, అమిత్ షా నాయకత్వంలో దేశం అభివృద్ధివైపు దూసుకుపోతుందని ఎంపీ సుజనా చౌదరి వ్యాఖ్యానించారు . టీడీపీతో రాజకీయ జీవితం ఆరంభించిన సుజనా ఇటీవల బీజేపీలో చేరిన తరువాత అటు టీడీపీ అధినేత చంద్రబాబుపై, ఇటు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి పై ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు.

గ్రామ సచివాలయ ఉద్యోగులకు రూల్స్ ఇవే…!

0

వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల సమయంలోనే గ్రామ, వార్డ్ సచివాలయ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసి, పరీక్షలు నిర్వహించి, ఎంపికయిన వారికి నియామకపత్రాలను పంపిణీ చేయటం జరిగింది. అక్టోబర్ నెల 2వ తేదీ నుండి ఈ ఉద్యోగాలకు ఎంపికయిన వారు విధులకు హాజరు కావాల్సి ఉంటుంది. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలకు ఎంపికయిన వారు తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన నియమ నిబంధనలు ఉన్నాయి.

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలకు ఎంపికై నియామక పత్రాలను అందుకున్నవారు తప్పనిసరిగా 30 రోజుల్లో విధుల్లో చేరాల్సి ఉంటుంది. 30 రోజుల్లో విధులకు హాజరు కాని పక్షంలో హాజరు కాని వారిని ఎంపిక జాబితా నుండి తొలగిస్తారు. ప్రభుత్వ వైద్యశాలల నుండి ఈ ఉద్యోగాలలో చేరే అభ్యర్థులు బాడీ ఫిట్నెస్ సర్టిఫికెట్ తెచ్చుకుని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే ప్రభుత్వ సంస్థల్లో కేంద్రంలో లేదా రాష్ట్రంలో పని చేస్తున్న వారు ఆ సంస్థల నుండి బయటకు వచ్చేసినట్లు ధ్రువపత్రం ఖచ్చితంగా సమర్పించాలి.

ఎవరైనా తప్పుడు ధ్రువపత్రాలు సమర్పించినట్లు విచారణలో తేలితే వారు ఉద్యోగం కోల్పోవటంతో పాటు ప్రభుత్వం వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటుంది. ప్రభుత్వం సచివాలయ ఉద్యోగాలకు ఎంపికైన వారికి రెండు సంవత్సరాల పాటు గౌరవ వేతనం కింద 15,000 రూపాయలు చెల్లిస్తుంది. ప్రభుత్వానికి ఈ రెండు సంవత్సరాల సమయంలో ఎటువంటి నోటీసులు ఇవ్వకుండానే ఉద్యోగాలకు ఎంపికయిన వారిని విధుల నుండి తొలగించే అధికారం ఉంది.

సచివాలయ ఉద్యోగాలకు ఎంపికైన వారు ఈ రెండు సంవత్సరాల కాలంలో నిర్దేశిత ప్రమాణాలకు తగిన ప్రతిభ కనబరిస్తే శాశ్వత స్కేలులోకి ప్రభుత్వం తీసుకుంటుంది. లేకపోతే ప్రభుత్వానికి తొలగించే హక్కు కూడా ఉంది. మూడు సంవత్సరాల కాలంలో ఉద్యోగం వదిలి వెళ్లాలనుకుంటే అప్పటివరకు అందుకున్న గౌరవ వేతనాలతో పాటు, భత్యాలు కూడా వెనక్కు ఇచ్చేయాల్సి ఉంటుంది. పరిమితులకు, నిబంధనలకు ఎవరైనా విరుద్ధంగా వ్యవహరిస్తే నెల రోజుల నోటీసుతో ఉద్యోగం నుండి తొలగించే అవకాశం ఉంది.

జగన్ ని మనస్ఫూర్తిగా మెచ్చుకున్న చంద్రబాబు

0
జగన్ ని మనస్ఫూర్తిగా మెచ్చుకున్న చంద్రబాబు

ఎప్పుడూ జగన్ పై విమర్శల జడివాన కురిపించే చంద్రబాబు కూడా ఏదో ఒక సందర్భంలో అయినా తన మనసులో మాట బైటపెడుతుంటారు. అలాంటి సందర్భమే ఇటీవల జరిగిన పార్టీ భేటీలో చోటు చేసుకుంది. సీనియర్లతో జరిగిన అంతర్గత సమావేశంలో చంద్రబాబు జగన్ ఆలోచనా విధానాన్ని మెచ్చుకుంటూనే ఆశ్చర్యం వ్యక్తంచేశారు. నవరత్నాలు, మిగతా పథకాల సంగతి ఎలా ఉన్నా.. సచివాలయాల ఉద్యోగులు, వాలంటీర్ల పోస్ట్ ల విషయంలో జగన్ తీసుకున్న నిర్ణయం సాహసోపేతమైనదే కాదు, వచ్చే ఎన్నికల్లోనూ వైసీపీని విజయతీరం చేర్చేదిలా ఉందని చంద్రబాబు అనుమానం వ్యక్తంచేశారు. మనకెందికీ ఆలోచన రాలేదని కుమిలిపోయారు.

అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే 1,34,500 ఉద్యోగాల భర్తీ అంటే మాటలు కాదు, గ్రామ, వార్డ్ వాలంటీర్ పోస్ట్ లు వీటికి అదనం. ఒక్కసారిగా గ్రామీణ స్థాయిలో, పట్టణాల్లో ఉన్న నిరుద్యోగ సమస్యను చేతితో తుడిచేసినట్టు చేశారు జగన్. 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబుకి ఇలాంటి ఆలోచన రాకపోవడం నిజంగా ఆయన దురదృష్టమే. కేవలం చంద్రబాబుకే కాదు, ఇతర రాష్ట్రాల సీనియర్ మోస్ట్ ముఖ్యమంత్రులు కూడా ఈ నవయువకుడు చేసిన పనికి ఆశ్చర్యపోతున్నారు, ఆయన అడుగుజాడల్లో నడవాలని నిర్ణయించుకుంటున్నారు.

అయితే ఇక్కడ చంద్రబాబు తన పార్టీ సహచరుల దగ్గర జగన్ ని మెచ్చుకోవడమే విచిత్రం. సచివాలయ ఉద్యోగాలపై జగన్ హామీ ఇచ్చిన సందర్భంలో అందరూ ఇది అమలయ్యేనా అని టీడీపీ వితండవాదం చేసింది. నోటిఫికేషన్ పడ్డాక ఎవరు ఆసక్తి చూపిస్తారంటూ వెటకారం చేశారు ఆ పార్టీ నేతలు. తీరా పోస్టింగ్ లు ఇచ్చే సమయానికి పేపర్ లీక్, రాజకీయ సిఫార్సులు అంటూ నానా రాద్ధాంతం చేశారు. ఇప్పుడా ఆరోపణల్లో కూడా పసలేదని తేలిపోయింది.

మొత్తమ్మీద గ్రామ సచివాలయం, సచివాలయాలతో లక్షా 35వేల నూతన ఉద్యోగాల కల్పన అనే కాన్సెప్ట్ బ్రహ్మాండంగా సక్సెస్ కావడంతో చంద్రబాబు మనసులో మాట తన పార్టీ ముఖ్యుల దగ్గర బైటపెట్టారు. పైకి విమర్శలు గుప్పిస్తూనే ఉన్నా.. తనకిలాంటి ఆలోచన రానందుకు లోలోన మథనపడుతున్నారు చంద్రబాబు.