Home Blog Page 3

ప్రతీ జనవరికి రెడీగా ఉండండి…జగన్ సంచలనం

0

ప్రతి జనవరిలోను ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేస్తామని జగన్మోహన్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగాలకు ఎంపికైన యువతకు జగన్ నియామక ఉత్తర్వులిచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి జనవరిలోను ఉద్యోగాల భర్తీకి చర్యలు తీసుకోబోతున్నట్లు సంచలన ప్రకటన చేశారు. అందుకని నిరుద్యోగులు అప్లికేషన్లు పెట్టుకోవటానికి రెడీగా ఉండాలంటూ పిలుపుకూడా ఇచ్చారు.

మొత్తానికి చెప్పిన మాట గనుక జగన్ నిలబెట్టుకుంటే ప్రతిపక్షాల పని అందులోను చంద్రబాబునాయుడు పని దాదాపు అయిపోయినట్లే. ఎందుకంటే అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే జగన్ దాదాపు 4 లక్షల ఉద్యోగాలను భర్తీ చేశారు. గ్రామ వాలంటీర్లు, గ్రామ, వార్డు సచివాలయల్లో వివిధ ఉద్యోగాలను భర్తీతో శ్రీకారం చుట్టిన విషయం అందరికీ తెలిసిందే.

ఇదే వరసను గనుక కొనసాగిస్తే దాదాపు లక్షలాది ఉద్యోగాలను జగన్ భర్తీ చేసేట్లే కనిపిస్తున్నారు. అదే గనుక జరిగితే చంద్రబాబుకు ఇబ్బందులు తప్పవు. ఎందుకంటే తాను సిఎంగా ఉన్న కాలంలో ఏనాడు ఉద్యోగాల కల్పన చేసింది లేదు. మొన్న ఐదేళ్ళ అధికారంలో కూడా డిఎస్సీ ఉద్యోగాల భర్తీ అంటూ ప్రకటనలైతే చేశారు కానీ భర్తీ మాత్రం చేయలేదు.మొక్కుబడి ప్రకటనలు చేసి జనాలను మోసం చేసేవాళ్ళకు, ఇచ్చిన హామీని కార్యరూపంలోకి తీసుకొచ్చే వాళ్ళకు జనాలు తేడాను బాగానే గ్రహించారు. అందుకనే మొన్నటి ఎన్నికల్లో జనాలు టిడిపి గూబగుయ్యిమనిపించారు.

తాజాగా జగన్ భర్తీ చేసిన వాలంటీర్లు, గ్రామ సచివాలయాల ఉద్యోగాలతో మిగిలిన నిరుద్యోగులకు కూడా ఆశలు చిగురించటం ఖాయంగానే ఉంది. ఎందుకంటే ప్రభుత్వ శాఖల్లో దాదాపు 3 లక్షల ఉద్యోగాలు భర్తీకి నోచుకోకుండా సంవత్సరాల తరబడి ఉండిపోయాయి. నిరుద్యోగుల జీవితాలతో చంద్రబాబు ఆడుకున్నట్లుగా జగన్ ఆడుకునేందుకు సిద్దంగా లేరు. అందుకే ప్రతీ జనవరిలోను ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇస్తానని జగన్ ప్రకటించగానే అందరూ హర్షం తెలుపుతున్నారు.

కులాలు.. మతాలు..రాజకీయాలు..పార్టీలు చూడొద్దు : సీఎం జగన్..!

0
కులాలు.. మతాలు..రాజకీయాలు..పార్టీలు చూడొద్దు : సీఎం జగన్..!

ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిగారు విజయవాడలోని ఏప్లస్ కన్వెన్షన్ లో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నియామక పత్రాలను అందజేయటం కొరకు హాజరయ్యారు. సచివాలయ రాత పరీక్షల్లో అర్హత సాధించి సర్టిఫికెట్ల పరీశీలన కూడా పూర్తయిన వారికి సీఎం జగన్ నియామక పత్రాలను అందజేశారు. జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ దేశ చరిత్రలో అత్యంత తక్కువ సమయంలో, అత్యంత పారదర్శకంగా 20 లక్షల కంటే ఎక్కువమంది ఉద్యోగాల కొరకు హాజరు కావటం దాదాపుగా 1,40,000 మందికి శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలు రావటం దేశ చరిత్రలోనే ఒక రికార్డు అన్నారు.

నాలుగు నెలలు పూర్తి కాకముందే నాలుగు లక్షల ఉద్యోగాలు ఇచ్చామని జగన్ అన్నారు. సొంత మండలంలోనే ఉద్యోగం వచ్చే అదృష్టం ఎంతో తక్కువ మందికి వస్తుందని అన్నారు. లంచాలు తీసుకోకుండా నిజాయితీగా పారదర్శక పాలన అందించాలని సీఎం కోరారు. ప్రతి పేదవాడి ముఖంలో చిరునవ్వును గ్రామ వాలంటీర్లు, గ్రామ సచివాలయ ఉద్యోగులు తీసుకొనిరావాలని జగన్ అన్నారు.

ప్రజలకు సేవలు అందించటం కొరకు ఉద్యోగాలు చేస్తున్నామని గుర్తు పెట్టుకోవాలని అన్నారు. గ్రామాలలో పాలనావ్యవస్థ వెంటిలేటర్ పై ఉంది. ఇటువంటి వ్యవస్థను బాగు చేసేందుకు ప్రతి గ్రామానికి ఒక సచివాలయాన్ని తీసుకొచ్చామని అన్నారు. 72 గంటల్లోనే ప్రజల సమస్యలను పరిష్కరిస్తే వచ్చిన వాళ్ల ముఖంలో కనిపించే చిరునవ్వును ఒక్కసారి గుర్తు తెచ్చుకోవాలని అన్నారు.

2020 జనవరి 1వ తేదీ నుండి గ్రామ సచివాలయం, గ్రామ వాలంటీర్ల సేవలు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తాయని అన్నారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ పథకాలు అందాలని జగన్ కోరారు. కులాలు, మతాలు, రాజకీయలు, పార్టీలు చూడొద్దని జగన్ అన్నారు. 2019 ఎన్నికల్లో మనకు ఓటు వేయనివారు కూడా పరిపాలనను చూసి వచ్చే ఎన్నికల్లో ఓటు వేయాలని అన్నారు.

నాలుగు నెలల్లో నాలుగు లక్షల ఉద్యోగాలు : మంత్రి బొత్స…!

0
నాలుగు నెలల్లో నాలుగు లక్షల ఉద్యోగాలు : మంత్రి బొత్స...!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విజయవాడలో సచివాలయ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నియామక పత్రాలు అందజేసే కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. సీఎం జగన్మోహన్ రెడ్ది గారు పాదయాత్ర చేసిన సమయంలో ఎంతోమంది జగన్ ను కలిసి వారి బాధలు, వేదనలు చెప్పిన తరువాత వ్యవస్థను ప్రక్షాళన చేయాలంటే, వ్యవస్థను మెరుగుపరచాలంటే ఒక కొత్త ప్రయోగం చేయాలి మరియు కొత్త ఒరవడిని తీసుకొనిరావాలనే ఉద్దేశంతో గ్రామ, వార్డు సచివాలయాలను అందుబాటులోకి తెచ్చారని అన్నారు.

వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగు నెలలైనా పూర్తి కాకముందే నాలుగు నెలల్లో 4 లక్షల పది వేల ఉద్యోగాలు వైసీపీ ప్రభుత్వం కల్పించిందని చెప్పారు. వైసీపీ ప్రభుత్వం నవరత్నాలలోని హామీలను మాత్రమే కాకుండా, ప్రజలకు మేలు చేసే ప్రతి అంశాన్ని కూడా పరిగణనలోకి తీసుకుంటుందని చెప్పారు. 1,34,000 గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలు మాత్రమే కాక 2,70,000 గ్రామ, వార్డు వాలంటీర్ల ఉద్యోగాలు కల్పించామని చెప్పారు. జగన్ తీసుకున్న నిర్ణయం ప్రజా సంక్షేమం మరియు రాష్ట్ర అభివృద్ధి కొరకు ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు.

గ్రామీణ వ్యవస్థ, పట్టణ వ్యవస్థ అభివృద్ధిలో గ్రామ సచివాలయ ఉద్యోగాలకు ఎంపికైన వారందరినీ భాగస్వామ్యులను చేస్తున్నామని అన్నారు. రాబోయే కాలంలో గ్రామ సచివాలయ ఉద్యోగాలకు ఎంపికైన వారు సక్రమంగా బాధ్యతలు నిర్వర్తిస్తే ప్రభుత్వానికి మంచిపేరు వస్తుందని అన్నారు. మీరు ఏదైనా పొరపాటు చేస్తే ప్రభుత్వం తలదించుకునే పరిస్థితి వస్తుందని బొత్స అన్నారు.చంద్రబాబునాయుడు గారు వాలంటీర్లపై ఇష్టం వచ్చినట్లుగా వ్యాఖ్యలు చేస్తున్నారని మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష హోదాలో ఉన్న నాయకుడు వాలంటీర్లపై చులకనభావంతో వ్యాఖ్యలు చేయటం సరికాదని బొత్స అన్నారు. గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ మరియు గ్రామ, వార్డు వాలంటీర్ల ద్వారా ప్రభుత్వ పథకాలు నేరుగా ప్రజల ఇంటికే చేరుతాయని బొత్స అన్నారు.

గ్రామ సచివాలయాల ప్రారంభానికి ముహూర్తం కుదిరింది….!!

0
గ్రామ సచివాలయాల ప్రారంభానికి ముహూర్తం కుదిరింది....!!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు, ముఖమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మొదటి రోజునుండి రాష్ట్రంలో పాలనను చాలావరకు మెరుగ్గా ముందుకు తీసుకెళ్తున్నారు అనే చెప్పాలి. ఇక ఇప్పటికే వారి మ్యానిఫెస్టో లోని పలు పథకాలను అమలు చేసిన సీఎం, గత కొద్దిరోజులుగా రాష్ట్రంలోని గ్రామ సచివాలయాల ప్రారంభంపై గట్టిగా దృష్టి పెట్టారు. ఇప్పటికే సచివాలయ ఉద్యోగుల ఎంపిక కోసం రాత పరీక్ష నిర్వహించి వాటి ఫలితాలను కూడా వెల్లడించడం జరిగింది. ఈ గ్రామ సచివాలయాలను అక్టోబర్ 2న గాంధీ మహాత్ముని జయంతి నాడు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ప్రారంభించనున్నారు.

ఇకపోతే గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలకు ఎంపికైన వారిని సొంత గ్రామంలో తప్ప వారు కోరుకున్న చోట మరెక్కడైనా సరే నియమించాలని నిర్ణయించింది ప్రభుత్వం. అలానే ఉద్యోగి సొంత మండలంలో మరేదైనా గ్రామమైనా, లేదా జిల్లాలో మరెక్కడైనా కోరుకున్న ప్రాంతంలో పోస్టింగ్‌ ఇవ్వనున్నారు. పోస్టింగ్‌ కోసం సొంత జిల్లాలో మూడు ప్రాంతాలను ఎంపిక చేసుకునే అవకాశాన్ని అభ్యర్ధికి ప్రభుత్వం కల్పించబోతోంది. ఇక ప్రభుత్వం నుండి అందుతున్న లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్ లో మొత్తం 11,158 గ్రామ సచివాలయాలు కాగా, మరొక 3,786 వార్డు సచివాలయాలు ఏర్పాటుకానున్నాయి. ఇవి మొత్తం కలిపి 14,944 గా ఉండనున్నాయి. నేడు విజయవాడలోని ఏ ప్లస్ కన్వేషన్ సెంటర్ లో నిర్వహించిన కార్యకమంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సహా పలువురు రాష్ట్ర మంత్రులు పాల్గొన్న సభలో గ్రామ సచివాలయ ఉద్యోగులకు నియామక పత్రాలు అందచేయడం జరిగింది.

వీలైనంత వరకు మొదటి ప్రాధాన్యతగా వారు కోరుకున్న ప్రాంతంలోనే పోస్టింగ్‌ ఇస్తారు. ఒకే గ్రామ సచివాలయంలో ఒకే పోస్టుకు ఇద్దరు ముగ్గురు పోటీపడినప్పుడు ఉద్యోగులు కోరుకున్న రెండు, మూడు స్థానాల్లో అవకాశం కల్పిస్తారు. భారత దేశ చరిత్రలోనే ఇది అతి పెద్ద రిక్రూట్మెంట్ అని, అలానే గ్రామ సచివాలయ ఉద్యోగులుగా ఎంపిక అయిన ప్రతిఒ క్కరూ కూడా ఎంతో బాధ్యతతో తమ పనిని సక్రమంగా నిర్వహించి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని, రాబోయే రోజుల్లో యువతకు మరింత పెద్ద పీట వేసేలా ఉద్యోగాలు కల్పించే విధంగా సీఎం గారు ఆలోచన చేస్తున్నట్లు పలువు మంత్రులు ఈ సందర్భంగా మాట్లాడుతూ చెప్పారు….!!

రజనీ ఎంట్రీ… బాబు బుక్కైపోయారబ్బా!

0
రజనీ ఎంట్రీ... బాబు బుక్కైపోయారబ్బా!

అధికారం కోల్పోయాక… జనంలో కంటే సోషల్ మీడియాలో యాక్టివ్ గా మారిపోయిన టీడీపీ నేతలకు ప్రత్యేకించి టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు – ఆయన తనయుడు నారా లోకేశ్ లను అదే సోషల్ మీడియా వేదకగా వైసీపీ నేతలు కిందా మీదా పడేసి కొట్టేసినంత పనిచేస్తున్నారు. ఎన్నికలకు ముందు నుంచే వైసీపీ ప్రధాన కార్యదర్శి – ఆ పార్టీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి సోషల్ మీడియాలో టీడీపీ నేతలను ఓ ఆటాడుకుని – ఇప్పుడు ఆ డోస్ ను మరింతగా పెంచేశారనే చెప్పాలి. సాయిరెడ్డికి తోడుగా ఇప్పుడు కొత్తగా ఎమ్మెల్యేలుగా ఎన్నికైన చాలా మంది వైసీపీ ఎమ్మెల్యేలు కూడా సోషల్ మీడియాలో బాబు అండ్ కోను చెడుగుడు ఆడుకుంటున్నారనే చెప్పాలి. అలా సోషల్ మీడియాలోకి దూసుకువచ్చిన వైసీపీ యువ మహిళా నేత – గుంటూరు జిల్లా చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజనీ దెబ్బకు చంద్రబాబు అడ్డంగా బుక్కైపోయారనే చెప్పాలి.

వైసీపీ సర్కారు అధికారంలోకి వచ్చాక గ్రామాల్లో ప్రజలకు సేవలందించేందుకు గ్రామ వలంటీర్ వ్యవస్థ కొత్గగా ఏర్పాటైన సంగతి తెలిసిందే. ఈ వ్యవస్థలో ఉపాధి లభించిన వారంతా వైసీపీ అనుకూలురేనని టీడీపీ ఆరోపిస్తున్న సంగతీ తెలిసిందే. ఇంతదాకా అయితే ఓకే గానీ… గ్రామ వలంటీర్లుగా ఎన్నికైన వారి గురించి చంద్రబాబు నిన్న కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు అటు వలంటీర్లను బాగానే ఇబ్బంది పెట్టగా… ఆ వ్యవస్థను తీసుకొచ్చిన వైసీపీ నేతలను కూడా కలచివేశాయన్న వాదన వినిపించింది. అందుకే కాబోలు… అసలు వలంటీర్లు ఎలాంటి పనులు చేస్తున్నారన్న విషయాన్ని కళ్లకు కట్టినట్టుగా చూపేట్టేలా విడదల రజనీ ఓ ట్వీట్ ను పోస్ట్ చేశారు. సదరు ట్వీట్ లో బాబు అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ… గ్రామాల్లో ప్రజలకు వలంటీర్లు ఎలాంటి సేవలు అందిస్తున్నారన్న విషయాన్ని కూడా ఆమె ప్రస్తావించారు. ఈ ట్వీట్ తో వలంటీర్ల వ్యవస్థపై వ్యాఖ్యలతో చంద్రబాబు అడ్డంగా బుక్కయ్యారనే చెప్పక తప్పదు.

అయినా సదరు ట్వీట్ లో విడదల రజనీ ఏం పోస్టు చేశారన్న విషయానికి వస్తే… అనారోగ్యంతో బాధపడుతున్న ఓ వృద్ధుడిని అంబులెన్స్ లోకి ఎక్కించడంతో పాటుగా అప్పటికప్పుడు అవసరమైన అత్యవసర చికిత్సలను అందిస్తున్న మహిళా వలంటీర్ ఫొటోలను రజనీ అందులో పోస్ట్ చేశారు. ఆ ఫొటోలను ప్రస్తావిస్తూ గ్రామ వలంటీర్లు ఎంత గొప్ప సేవలు అందిస్తున్నారన్న విషయాన్ని కూడా ప్రస్తావించారు. అంతేకాకుండా… ఇంతటి ఉదాత్తమైన సేవలు అందిస్తున్న వలంటీర్లను కించపరిచేలా చంద్రబాబు వ్యాఖ్యలు చేయడం ఆయన స్థాయికి తగదని కూడా రజనీ గట్టి కౌంటరే ఇచ్చారు. సదరు ట్వీట్ లో బాబును రజనీ ఎంతగా కడిగేశారంటే… ‘స్పృహ కోల్పోయిన ఒక అనాధ వ్యక్తిని చేరదీసి 108 వాహనం లోకి ఎక్కిస్తున్న ధర్మసాగరం గ్రామ వలంటీర్ బోయాలమ్మ. ఇలాంటి గొప్ప మనసున్న వాలంటీర్ల గురించి నిన్న చంద్రబాబు గారు చేసిన హృదయాన్ని నొచ్చుకునే వ్యాఖ్యలు బాధాకరం’ అంటూ బాబును నిజంగానే అడ్డంగా బుక్ చేసేశారు.

నాడు వైఎస్.. నేడు జగన్.. అరుదైన అవకాశం

0
నాడు వైఎస్.. నేడు జగన్.. అరుదైన అవకాశం

ఒకే కుటుంబం నుంచి.. అదీ సీఎం హోదాలో.. ఇప్పటివరకూ ఉమ్మడి ఏపీ చరిత్రలోనే ఇంతటి అరుదైన అవకాశం ఎవ్వరికీ దక్కలేదట… తిరుమల శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించే విషయంలో తండ్రీ కొడుకులు వైఎస్ రాజశేఖర్ రెడ్డి వైఎస్ జగన్ లు సీఎం హోదాలో స్వామి సేవలో పాల్గొనడం అత్యంత అరుదైనదిగా వైసీపీ శ్రేణులు భావిస్తున్నాయి.

మంగళవారం ఉదయం తిరుమల శ్రీవారికి సీఎం హోదాలో జగన్ తొలిసారి పట్టువస్త్రాలను సమర్పించనున్నారు. గతంలో ఉమ్మడి ఏపీ రాష్ట్రానికి సీఎంగా ఉన్న రాజశేఖర్ రెడ్డి ఇదే స్వామికి పట్టువస్త్రాలు సమర్పించగా.. మళ్లీ ఆయన తనయుడు కూడా సీఎం హోదాలోనే పట్టువస్త్రాలు సమర్పిస్తుండడం విశేషంగా మారింది.

టీటీడీ చరిత్రలోనే ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు ముఖ్యమంత్రి హోదాలో తిరుమలేషుడికి పట్టువస్త్రాలు సమర్పించడం అత్యంత అరుదైనదిగా భావిస్తున్నారు. సాయంత్రం ధ్వజారోహణ తర్వాత సీఎం జగన్ ప్రభుత్వం తరుఫున ఈ పట్టువస్త్రాలు సమర్పిస్తారు. గర్భగుడి లోకి వెళ్లి సమర్పించి స్వామిని దర్శించుకుంటారు.

సీఎం జగన్ ఎన్నికల ప్రచారానికి ముందు పాదయాత్ర ప్రారంభించే ముందు కూడా శ్రీవారిని దర్శించుకున్నారు. సీఎంగా బాధ్యతలు స్వీకరించే ముందు కూడా వెంకన్నను దర్శించుకున్నాకే సీఎం పీఠమెక్కారు. తిరుమలేషుడిని సెంటిమెంట్ గా మార్చుకున్న జగన్ ఇప్పుడు పట్టువస్త్రాలు కూడా తనే స్వయంగా సమర్పిస్తుండడం విశేషంగా మారింది.

హిందూ దేవాలయాలపై జగన్ సర్కారు చారిత్రాత్మక నిర్ణయం

0

కలియుగ ప్రత్యక్ష దైవం కొలువైన తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇటీవల ఓ అన్యమస్థుడు పనిచేస్తున్నాడని.. అతడి ఇంటిలోని మతం వేడుక చేసుకుంటున్న తీరు గురించి వీడియో సైతం రిలీజ్ చేసి కొందరు రచ్చ చేసిన సంగతి తెలిసింది..దీంతో జగన్ సర్కారు అన్యమతస్థులను టీటీడీపీలో ఉద్యోగాలిచ్చి తిరుమల పవిత్రతకు భంగం కలిగిస్తోందని బీజేపీ సహా చాలా పార్టీలు నేతలు విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే..

అందుకే తాజాగా ఆంధ్రప్రదేశ్ లోని వైఎస్ జగన్ సర్కారు సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై హిందూ దేవాలయాల్లో హిందువులకే ఉద్యోగ అవకాశాలు ఉంటాయని స్పష్టం చేసింది. అన్యమతస్థులను అనుమతించరని తెలిపింది. ఈ ఆదేశాలు ప్రసిద్ధ తిరుమల తిరుపతి దేవస్థానంతోపాటు ఏపీలోని అన్ని దేవలయాలకు ఇదే నిబంధన వర్తిస్తుందని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఆయా దేవాలయాల్లో అన్యమతస్థులు పనిచేస్తుంటే వారిని వేరే శాఖాల్లో మార్పు చేయాలని ప్రభుత్వం ఆ జీవో స్పష్టం చేసింది.

టీటీడీ సహా ప్రముఖ దేవాలయాల్లో హిందూయేతరులు ఉంటే అందుకు సంబంధించిన సాక్ష్యాలు ఉంటే విజిలెన్స్ శాఖకు అందిస్తే నిజనిర్ధారణ చేసి అధికారులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.చర్యలు తప్పవు.. ఒక వేళ అన్యమతంలో కొనసాగుతూ హిందూ దేవాలయాల్లో విధులు నిర్వహిస్తుంటే.. విజిలెన్స్ శాఖకు సమాచారం అందించాలని జీవోలో స్పష్టం చేసింది. సదరు ఉద్యోగుల ఇళ్లల్లో జరిగే పండగలు, పెళ్లిళ్లు, ప్రార్థనలకు సంబంధించిన వీడియోలను విజిలెన్స్ శాఖకు అందజేస్తే.. విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని తెలిపింది.

బాబు హయాంలోనే.. చంద్రబాబు హయాంలో కూడా అన్యమతస్తులను హిందూ దేవలయాల్లో నియమించారని, వారందరినీ తొలగించాలని హిందూ సంఘాలు ఇటీవల డిమాండ్ చేశాయి. హిందూ దేవాలయాల్లో అన్యమతస్తులు, హిందుయేతర వ్యక్తుల నియామకంపై విమర్శలు వస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ మేరకు చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది.

విమర్శల నేపథ్యంలో.. శ్రీశైలంతోపాటు ఇతర ప్రముఖ దేవాలయాల్లోనూ ఇతర మతస్తులను ఉద్యోగాల్లో నియమించడం పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. హిందూ ఆలయాల్లో హిందువులను మాత్రమే ఉద్యోగాల్లో నియమించాలనే డిమాండ్లు పెరిగాయి. హిందూ సంఘాలు, రాజకీయ పార్టీల నేతలు కూడా ఏపీ సర్కారుపై విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో ఏపీ సర్కారు తాజా నిర్ణయం తీసుకుంది.

బాబు సహా ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేల ఎన్నికపై హైకోర్టులో విచారణ

0
బాబు సహా ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేల ఎన్నికపై హైకోర్టులో విచారణ

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. నామినేషన్ సందర్భంగా చంద్రబాబు తన ఆదాయ వివరాలను అఫిడవిట్ లో వెల్లడించలేదని – ఇది ఎన్నికల నియమావళికి విరుద్దమని పేర్కొంటూ చంద్రబాబు చేతిలో ఓటమి పాలైన వైసీపీ నేత చంద్రమౌళి తరఫున ఎన్నికల ఏజెంట్ గా పనిచేసిన ఏఎస్ విద్యాసాగర్ దాఖలు చేసిన పిటిషన్ లో పేర్కొన్నారు.

ఈ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన హైకోర్టు చంద్రబాబుకు నోటీసులు జారీచేసింది. ఈ వ్యాజ్యంపై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సీహెచ్ మానవేంద్రనాథ్ రాయ్ శనివారం విచారణ చేపట్టారు. సమాదానం చెప్పాలంటూ ఎన్నికల రిటర్నింగ్ అధికారితోపాటు వ్యాజ్యంలో ఇతర ప్రతివాదులకు నోటీసులు ఇచ్చారు. ఆదాయ మార్గాల వివరాలన్నింటినీ ఎన్నికల అఫిడవిట్ లో వెల్లడించకుండా చంద్రబాబు గోప్యత పాటించారని.. ప్రభుత్వ నిధుల నుంచి ముఖ్యమంత్రిగా జీతం తీసుకున్న విషయాన్ని కూడా చంద్రబాబు అఫిడవిట్లో చెప్పలేదని విద్యాసాగర్ తన పిటిషన్లో ఆరరోపించారు.

మరోవైపు తెలుగుదేశం పార్టీకే చెందిన కృష్ణా జిల్లా గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి కూడా హైకోర్టు నోటీసులు జారీ చేసింది. వంశీ ఎన్నికను రద్దు చేయాలని కోరుతూ గన్నవరం వైఎస్ఆర్సీపీ అభ్యర్థి యార్లగడ్డ వెంకటరావు పిటిషన్ దాఖలు చేశారు. ఎన్నికల ప్రచారం సమయంలో వంశీ సూచన మేరకు ఆయన ప్రతినిధులు ఇంటి స్థలాల నకిలీ పట్టాలను పంచి ప్రలోభ పెట్టారని తెలిపారు. లెక్కింపు కూడా చట్ట విరుద్ధంగా జరగడంతో తాను 990 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యానని ఆయన ఆరోపించారు. ఇంతకుముందు గుంటూరు పశ్చిమ టీడీపీ ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్ రావుకు సైతం హైకోర్టు నోటీసులు జారీచేసింది. ఆయన ఎన్నికను సవాల్ చేస్తూ ఓటమి పాలైన వైఎస్ ఆర్సీపీ అభ్యర్థి సీహెచ్ ఏసురత్నం హైకోర్టులో పిటిషన్ వేశారు. గిరిదర్ బ్యాంకు రుణాల ఎగవేశారని… అందుకే ఆయన ఎన్నిక రద్దు చేయాలని ఆ పిటిషన్లో ఏసురత్నం కోరారు.

మొత్తానికి టీడీపీ అధినేత చంద్రబాబు సహా ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేలపై ఎన్నికపై ఇప్పుడు హైకోర్టులో కేసులు నడుస్తున్నాయి.

నేడు సీఎం జగన్‌ తిరుపతిలో విస్తృత పర్యటన..

0
నేడు సీఎం జగన్‌ తిరుపతిలో విస్తృత పర్యటన..

రాష్ట్ర ముఖ్యమంత్రి వై ఎస్ జనగన్మోహన్ రెడ్డి తిరుపతిలో విస్తృతంగా పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనున్నారు. ఈ క్రమంలో విమానాశ్రమం నుంచి నేరుగా తిరుచానూరు సమీపంలో నిర్మించిన శ్రీ పద్మావతి నిలయాన్ని ప్రారంభిస్తారు. టీటీడీ దీని నిర్వహణ బాధ్యతలను ఏపీ టూరిజానికి అప్పగించనుంది. ఇందులో 200 గదులను నిర్మించారు. ఆ సాయంత్రం 4.15గంటలకు ‘అలిపిరి- చెర్లోపల్లె’ జంక్షన్‌లో నాలుగు లేన్ల రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు.అనంతరం తిరుమలలోని నందకం అతిథిగృహం వద్ద మాతృశ్రీ వకుళాదేవి యాత్రికుల వసతి సముదాయాన్ని ప్రారంభిస్తారు. దీనిని రూ.42.86 కోట్లతో.. ఐదు అంతస్తులతో.. 270 గదులతో టీటీడీ నిర్మించింది. అలాగే, రూ.79 కోట్లతో నిర్మించనున్న యాత్రికుల వసతి సముదాయానికి శిలాఫలకం ఆవిష్కరించి శ్రీపద్మావతి అతిథిగృహానికి చేరుకుంటారు.

బ్ర‌హ్మోత్స‌వాల మొద‌టి రోజు సీఎం వైఎస్‌.జ‌గ‌న్‌ రాష్ట్ర ప్ర‌భుత్వం త‌ర‌ఫున తిరుమ‌ల శ్రీ‌వారికి ప‌ట్టువ‌స్త్రాలు స‌మ‌ర్పిస్తార‌ని, ఇందుకోసం ప‌టిష్ట ఏర్పాట్లు చేప‌ట్టామ‌ని టీ టీ డి ఈవో తెలిపారు. మ‌ధ్యాహ్నం 3.30 గంట‌ల‌కు ముఖ్యమంత్రి రేణిగుంట విమానాశ్ర‌యానికి చేరుకుంటార‌ని చెప్పారు. అక్క‌డి నుండి తిరుచానూరుకు చేరుకుని ప‌ద్మావ‌తి నిల‌యం యాత్రికుల వ‌స‌తి స‌ముదాయాన్ని ప్రారంభిస్తారని వివ‌రించారు. ఆ త‌రువాత శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారిని ద‌ర్శించుకుంటారని చెప్పారు. అనంత‌రం నాలుగు వ‌రుస‌లుగా అభివృద్ధి చేయాల‌ని నిర్ణ‌యించిన అలిపిరి – చెర్లోప‌ల్లి రోడ్డు విస్త‌ర‌ణ ప‌నుల‌కు శంకుస్థాప‌న చేస్తారని తెలిపారు. శ్రీవారికి పట్టువస్త్రాలను సమర్పించేందుకు సోమవారం మధ్యాహ్నం సీఎం జగన్‌ జిల్లాకు వస్తున్నారు. తిరుపతి, తిరుమలలో రెండుచొప్పున ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు.మధ్యాహ్నం 3 గంటలకు తిరుపతి విమానాశ్రయానికి చేరుకుంటారు.

సీఎం పర్యటన సందర్భంగా అధికారులు గట్టి భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. అనంతరం 7 గంటలకు శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు.రాత్రి 8 గంటలకు పెద్దశేష వాహన సేవలో పాల్గొని తిరుమలలో బస చేస్తారు. మంగళవారం ఉదయం 9.40 గంటలకు తిరుగు ప్రయాణమవుతారు.అంతకు ముందు టిటిడి నిఘా మ‌రియు భ‌ద్ర‌తా సిబ్బంది, ఎస్‌సిసి క్యాడెట్లు, స్కౌట్స్ అండ్ గైడ్స్‌కు అయన అవ‌గాహ‌న కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మంలో టిటిడి అద‌న‌పు ఈవో ఎవి.ధ‌ర్మారెడ్డి, సివిఎస్‌వో గోపినాథ్ జెట్టి, అద‌న‌పు సివిఎస్వో శివ‌కుమార్‌రెడ్డి, విఎస్‌వో మ‌నోహ‌ర్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

చింతమనేని బాధితురాలు వనజాక్షికి కీలక పదవి

0

తహశీల్దార్ వనజాక్షి…ఈ పేరు చెప్పగానే దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ చేసిన దాడే గుర్తొస్తుంది. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో చింతమేని అరాచకాలకు వనజాక్షి కూడా బాధితురాలే. అప్పుడు ఇసుక అక్రమ రవాణాను అడ్డుకోవడానికి ప్రయత్నించిన వనజాక్షిపై చింతమనేని దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. ప్రభాకర్ మాత్రం గొడవ జరుగుతుంటే తాను వెళ్లానని – ఆమెపై దాడి చేయలేదని చెప్పుకొచ్చారు. అయితే ఆ వివాదం అక్కడితో ఆగకుండా చంద్రబాబు వరకు వెళ్లింది. ఆయన ఇద్దరిని పిలిపించి మాట్లాడి వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టారు.

చింతమనేని స్వయంగా దగ్గరుండి మరీ దాడి చేయించినా బాబు మాత్రం తమ పార్టీ ఎమ్మెల్యేకే వత్తాసు పలికారన్నది నిజం. ఈ వివాదం పెద్దది కాకుండా చంద్రబాబు ఎంత చేసినా సరే ఆ మచ్చ టీడీపీకి గానీ – చింతమనేని మీద గానీ పోలేదు. వైసీపీ దీన్నే ఆయుధంగా మలుచుకుని ఎన్నికల ముందువరకు చింతమనేని – టీడీపీపై విమర్శల వర్షం గుప్పించింది. అయితే దీనితో పాటు అనేక విమర్శలు రావడంతో చింతమనేని ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. ఇక చింతమనేని ఓటమికి చాలావరకు కారణమైన తహశీల్దార్ వనజాక్షి పేరు…మళ్ళీ మీడియాలో వచ్చింది.

తాజాగా వనజాక్షి ఆంధ్రప్రదేశ్ తహశీల్దార్ల అసోసియేషన్ (ఆప్టా) గౌరవాధ్యక్షురాలిగా నియమితులయ్యారు. గుంటూరు జిల్లా చినకాకానిలో తహశీల్దార్ల అసోసియేషన్ సర్వసభ్య సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆప్టా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఆప్టా అధ్యక్షుడిగా బీ రజినీకాంత్ ను ఎన్నుకున్నారు. అసోసియేట్ అధ్యక్షుడిగా వీ శ్రీనివాసులరెడ్డి ప్రధాన కార్యదర్శిగా పీ భాస్కరరావు ఎన్నికయ్యారు. ప్రస్తుతం వనజాక్షి విజయవాడ రూరల్ తహశీల్దార్ గా పని చేస్తున్నారు. ఆమె గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి సమీప బంధువు అవుతారు. గతంలో కృష్ణా జిల్లా ముసునూరు తహసీల్దార్ గా పనిచేస్తున్నప్పుడే ప్రభాకర్ ఆమెపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు.