Home Blog Page 31

జ‌గ‌న్ దే అప్ప‌ర్ హ్యాండ్ – YS Jagan is a High Level Political Leader In Andrapradesh

0

వైసిపి అధినేత జ‌గ‌న్…ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు మీద పై చేయి సాధించారా. జ‌గ‌న్ ఒత్తిడి చంద్ర‌బాబు పై ప‌ని చేసిందా. కేంద్రం నుండి టిడిపి మంత్రుల ఉప సంహ‌ర‌ణ నిర్ణ‌యం వెనుక ప్ర‌ధానం కార‌ణం ఏంటి. కేంద్ర ఆర్దిక మంత్రి అరుణ్ జైట్లీ గ‌తంలో చేసిన ప్ర‌క‌ట న‌నే మ‌రోసారి చేసారు. కానీ, టిడిపి గ‌తంలో అభినందించిన ప్ర‌క‌ట‌న‌నే ఇప్పుడు అభిశంసించింది. ఒక‌వైపు ప్ర‌తిపక్ష నేత జ‌గ‌న్ ఇప్ప‌టికే కేంద్రం పై అవిశ్వాసం కోసం ముహూర్తం కూడా ప్ర‌క‌టించారు. దీంతో ఆగ‌కుండా..పార్ల‌మెంట్ స‌మావేశాల చివ‌రి రోజున వైసిపి ఎంపీల రాజీనామాలు చేస్తార‌ని ప్ర‌క‌టించారు. దీంతో..టిడిపి పై ఒత్తిడి పెరిగింది. ప్ర‌జ‌లు సైతం వైసిపి తీసుకున్న నిర్ణ‌యాన్ని స్వాగ‌తిస్తున్నార‌ని గుర్తించారు. ప్ర‌త్యేక హోదా పై ఇప్ప‌టి వ‌ర‌కు భిన్నంగా వ్య‌వ‌హ‌రించిన టిడిపి..ఇప్పుడు యూ ట‌ర్న్ తీసుకున్నారు. తీసుకున్నారు అనే దాని కంటే..తీసుకోక త‌ప్ప‌ని ప‌రిస్థితి ఏర్ప‌డింది. జ‌గ‌న్ ఇప్ప‌టి వ‌ర‌కు ఏదైతే చెబుతూ వ‌చ్చారో అదే ఇప్పుడు చంద్ర‌బాబు చెబుతున్నారు.

ప్ర‌తిప‌క్షం తీసుకుంటున్న నిర్ణ‌యాలతో…ప్ర‌జ‌ల్లో ఇమేజ్ పెరుగుతోంది. ప‌రోక్షంగా టిడిపి పై ఒత్తిడి పెరిగింది. కేంద్ర ప్ర‌భుత్వం నుండి మంత్రులు ఉప సంహ‌రించుకొనే నిర్ణ‌యం తీసుకుంది. బిజెపితో తెగ‌దెంపుల‌కు నిజంగా చంద్ర‌బాబు సిద్ద మై ఉంటే..ఏకంగా ఎన్డీఏ నుండే బ‌య‌ట‌కు వ‌చ్చేసేవారు. కానీ, ప‌రిస్థితి అది కాదు. వైసిపి ఒత్తిడి బాగా ప‌ని చేసింది. కేంద్రం తో క‌య్యానికి టిడిపి కి ధైర్యం చాల‌ట్లేదు. ప‌దేప‌దే చంద్ర‌బాబు కార‌ణంగానే ఏపికి ప్ర‌త్యేక హోదా రాలేద‌ని జ‌గ‌న్ ఏదైతే చెబుతూ వ‌చ్చారో..ఇప్పుడు ఏకంగా కేంద్ర ఆర్దిక మంత్రి ఆరుణ్ జైట్లీ సైతం ఏపి ప్ర‌భుత్వంతో సంప్ర‌దింపులు జ‌రిపిన త‌రువాత‌నే ప్ర‌త్యేక ప్యాకేజిని ప్ర‌క‌టించామ‌ని చెప్పారు. ఇప్పుడు అదే..టిడిపికి డామేజ్ చేసే వ్యాఖ్య‌ల‌ని టిడిపి అధినాయ‌క‌త్వం గుర్తించింది. జ‌గ‌న్ చెప్పిన‌ట్లుగా టిడిపి ఆల‌స్యంగా నిర్ణ‌యం తీసుకున్నా..ఖ‌చ్చితంగా ఇది ప్ర‌జ‌ల విక్ట‌రీగానే భావించాల్సి ఉంటుంది. త‌న‌కు ఎదురులేద‌ని భావించే ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు త‌లొగ్గేలా చేయ‌టంలో జ‌గ‌న్ వ్యూహం స‌క్సెస్ అయింద‌నేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

జ‌గ‌న్ ఆన్ ఫైర్‌…ఆత్మ‌ర‌క్ష‌ణ‌లో టిడిపి – YS Jagan Masater Plan …TDP in self defense

0

వైసిపి అధినేత జ‌గ‌న్ మ‌రోసారి టిడిపిని ఆత్మ‌ర‌క్ష‌ణ‌లో ప‌డేసారు. ఇప్ప‌టికే వ్యూహాత్మ‌క ఒత్తిడితో కేంద్రం నుండి టిడిపి ఎంపీల‌ను ఉప‌సంహ‌రించుకొనేలా చేసిన జ‌గ‌న్‌..ఇప్పుడు ఏపికి ప్ర‌త్యేక హోదా కోసం కొత్త ఆఫ‌ర్ ప్ర‌క‌టించారు. తొలి నుండి ప్ర‌త్యేక హోదా కో సం పోరాడుతున్న వైసిపి..ఇప్పుడు ఏపిలో రాజ‌కీయంగాపై చేయి సాధించింది. టిడిపి కేంద్రం నుండి మంత్రుల‌ను ఉప‌సంహ‌రించు కున్నా..ఎన్డీఏ నుండి బ‌య‌ట‌కు రాలేదు. ఇదే స‌మ‌యంలో  జ‌గ‌న్ రాజ‌కీయ వ్యూహాల‌కు ప‌దును పెట్టారు. కేంద్రం పై ఈనెల 21న అవిశ్వాసం పెట్టేందుకు సిద్ద‌మ‌ని ప్ర‌క‌టించిన జ‌గ‌న్‌..ఇప్పుడు టిడిపి సిద్ద‌మ‌ని చెబితే..వెంట‌నే అవిశ్వాసం పెట్టేందుకు సిద్ద‌మ‌నే వి ష‌యాన్ని స్ప‌ష్టం చేసారు. వైసిపి ప్ర‌తిపాదించే అవిశ్వాసానికి మద్ద‌తు ఇవ్వాల‌ని ముఖ్య‌మంత్రికి సూచించారు. ఒక‌వేళ‌..టిడిపి యే అవిశ్వాసం ప్ర‌తిపాదిస్తే..అందుకు మ‌ద్ద‌తు ఇవ్వ‌టానికి తాను సిద్ద‌మ‌ని ప్ర‌క‌టించారు. దీని ద్వారా..తాను ఏపి ప్ర‌యెజ‌నాల కోస‌మే వ్య‌వ‌హ‌రిస్తున్నానే సంకేతాలిస్తూ..టిడిపిని రాజ‌కీయంగా ఆత్మ‌ర‌క్ష‌ణ‌లోకి నెట్టేసారు.

టిడిపి ఇంకా ఎన్డీఏ నుండి బ‌య‌ట‌కు రాక‌పోవ టంతో..టిడిపి ఇప్పుడు జ‌గ‌న్ ఆఫ‌ర్  కు సానుకూలంగా స్పందించే ప‌రిస్థితి క‌నిపించ‌టం లేదు. కానీ, జ‌గ‌న్ చేసిన ఆఫ‌ర్ పై ప్ర‌జ ల్లో మాత్రం సానుకూల స్పంద‌న క‌నిపిస్తోంది. ఇక‌, వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎవ‌రు అధికారంలోకి వ‌చ్చినా త‌న‌కు సంబంధం లేద‌ని..ఎవ‌రై తే ఏపికి ప్ర‌త్యేక హోదా ఇస్తూ సంత‌కం చేస్తారో వారికే త‌మ మ‌ద్ద‌తు ఉంటుంద‌ని ప్ర‌క‌టించారు. ఇందుకోసం ఏపి ప్ర‌జ‌లు ఎవ‌రినీ న‌మ్మ‌వ‌ద్ద‌ని..మొత్తం 25 పార్ల‌మెంట్ స్థానాల్లో వైసిపి అభ్య‌ర్ధుల‌నే గెలిపించాల‌ని ప్ర‌జ‌ల‌ను అభ్య‌ర్ధించారు. ఇలా..కొద్ది రోజులుగా ఏపికి ప్ర‌త్యేక హోదా అంశంలో జ‌గ‌న్ వ్యూహాత్మ‌కంగా వేస్తున్న అడుగులు..కేంద్రం పైనా..టిడిపి పైనా ఒత్తిడి పెంచ‌టమే కాకుండా.. ప్ర‌జ‌ల్లో వైసిపి ఇమేజ్ పెరిగేలా ఉంటున్నాయి. అయితే, రానున్న నాలుగైదు రోజుల్లో రాజ‌కీయంగా స‌మీక‌ర‌ణాలు మ‌రింత వేడి పుట్టించే అవ‌కాశం క‌నిపిస్తోంది.

జ‌గ‌న్ అడుగుల్లో 40 ఏళ్ల అనుభ‌వం – TDP Leader Chnadrababu Fallows YS Jagan

0

40 ఏళ్ల అనుభ‌వానికి ప‌ట్ట‌ప‌గ‌లే చుక్క‌లు. ప్ర‌తిప‌క్ష నేత బాట‌లో ముఖ్య‌మంత్రి. హోదా వ‌ద్దు ప్యాకేజి ముద్దు అంటూ ఊద‌ర గొట్టిన ముఖ్య‌మంత్రి..త‌న వాద‌నే వినిపించేలా చేయ‌టంలొ విప‌క్ష నేత జ‌గ‌న్ స‌క్సెస్ అయ్యారు. తొలి నుండి ఏపికి ప్ర‌త్యేక హోదా కోసం జ‌గ‌న్ పోరాటం చేస్తున్నారు. దీక్ష‌లు చేసారు. యువ‌భేరీలు నిర్వ‌హించారు. కానీ, అధికార‌ప‌క్షం మాత్రం హోదాతో ప్ర‌త్యేకంగా వచ్చే లాభాలు ఏమున్నాయో చెప్పాల‌ని..హోదా పేరుతో యువ‌త‌ను త‌ప్పుదోవ ప‌ట్టిస్తున్నార‌ని వాదించింది. కానీ, ఇప్పుడు సీన్ మారింది. జ‌గ‌న్ ర‌చించిన వ్యూహం స‌క్సెస్ అయింది. ఏపికి ప్ర‌త్యేక హోదా కోసం ప‌వ‌న్ క‌ళ్యాన్ తో స‌హా అనేక సంఘాలు స‌పోర్టింగ్ వాయిస్ వినిపిస్తున్నాయి. ఇక‌,నిన్నటి దాకా ప్యాకేజి అంటూ దాట‌వేసే ధోర‌ణితో వ్య‌వ‌హ‌రించిన టిడిపి నేత‌లు సైతం జ‌గ‌న్ బాట ప‌ట్టారు.

ప్ర‌త్యేక హోదా సెంటిమెంట్‌గా మార‌టం..దీనికి వైసిపి అధినేత నాయ‌క‌త్వం వ‌హించ‌టంతో..టిడిపిలో క‌ల‌క‌లం మొద‌లైం ది. ప్ర‌త్యేక హోదా కోసం ఢిల్లీలో పోరాటం..పార్ల‌మెంట్‌లో నిర‌స‌న‌లు..కేంద్రం పై అవిశ్వాస తీర్మానం..చివ‌ర‌గా ఎంపీల రాజీనామా ద్వారా..ప్ర‌జ‌ల్లో వైసిపి ఇమేజ్ ఒక్క‌సారిగా పెరిగిపోవ‌టంతో..టిడిపి దిద్దుబాటు చ‌ర్య‌లు మొద‌లు పెట్టింది. క్ర‌మ‌క్ర‌మంగా జ‌గ‌న్ వాయిస్ నే వినిపిస్తూ…ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ ను ఫాలో అవుతున్నారు. వైసిపి కి ప్ర‌జ‌ల మ‌ద్ద‌తు పెరుగుతున్న అంశాన్ని గ‌మ‌నించిన టిడిపి అప్ర‌మ‌త్త‌మైంది. బ‌డ్జెట్ స‌మావేశాల ప్రారంభ స‌మ‌యంలో గ‌వ‌ర్న‌ర్ స్పీచ్‌లో సైతం ప్ర‌త్యేక హోదా అంశాన్ని ప్ర‌స్తావించారు. వైసిపి ప‌క్కా వ్యూహంతో ముందుకు వెళ్తున్న వేళ‌..టిడిపి పూర్తిగా ఆత్మ‌ర‌క్ష‌ణ ధోర‌ణిలో ప‌డిపోయింది. దీని నుండి బ‌య‌ట ప‌డ‌టా నికి టిడిపి నేత‌లు త‌ప్ప‌ని ప‌రిస్థితుల్లో జ‌గ‌న్ నే ఫాలో అవుతున్నారు టిడిపి నేత‌లు

ఢిల్లీలో జ‌గ‌న్ వైబ్రేష‌న్స్ – YS Jagan Shakes Delhi

0

ఢిల్లీ వీధుల్లో ప్ర‌త్యేక హోదా డిమాండ్ ను హోరెత్తించిన వైసిపి. ఢిల్లీ పెద్ద‌ల‌ను ఎదిరించ‌టం కొత్త కాని జ‌గ‌న్‌..మ‌రోసారి ఏపికి ప్ర‌త్యే క హోదా కోసం హ‌స్తిన వీధుల్లో క‌ధం తొక్కారు. ఏపిలో కాదు..ఢిల్లీ వీధుల్లో ప్ర‌త్యేక హోదా కోసం పోరాటం చేయాలంటూ టిడిపి తో పాటుగా అనేక మంది జ‌గ‌న్ పై విమ‌ర్శ‌లు చేసారు. ఏ నిర్ణ‌యం తీసుకున్నా..వెనుక‌డుగు వేయ‌టం అల‌వాటు లేని జ‌గ‌న్ ఈ సారి కూడా పార్టీ శ్రేణుల‌కు స్ప‌ష్ట‌మైన దిశా నిర్ధేశం చేసారు. దీనికి అనుగుణంగా..ఢిల్లీ వీధుల్లో ఏపి ప్ర‌జ‌ల బ‌ల‌మైన వాయిస్ గా నిలిచిన ప్ర‌త్యేక హోదా డిమాండ్ ను వినిపించారు.

ప్యాకేజి వ‌ద్దు..హోదా ఏపి ప్ర‌జ‌ల హ‌క్కు అంటూ నినాదాల చేసారు. వైసిపి నేత‌లు పెద్ద ఎత్తున పాల్గొని హోదాకు మ‌ద్ద‌తుగా నినాదాలు చేసారు. పార్టీ నేత‌లు శాంతి యుతంగా నిర‌స‌న‌లు చేసిన నేత‌లను స్థానిక పోలీసులు అరెస్ట్ చేసారు. వైసిపి ఎంపీల‌ను అరెస్ట్ చేసే స‌మ‌యంలో వైసిపి కార్య‌క‌ర్త‌లు ఆందోళ‌న‌కు దిగారు. కేవ‌లం పార్ల‌మెంట్లో ప్ల‌కార్డులు ప‌ట్టుక‌ని నినాదాల‌కే ప‌రిమిత‌మైన టిడిపి నేత‌లు వైసిపి నేత‌ల పోరాటం చూసి విస్తుపోయారు. టిడిపి నేత‌ల నాట‌కీయ నిర‌స‌న‌లు తేలిపోయాయి. శ్రీకాకుళం నుండి చిత్తూరు వ‌ర‌కు క‌ద‌లి వ‌చ్చిన వైసిపి నేత‌లు మహా ధ‌ర్నా నిర్వ‌హించి త‌మ చిత్త‌శుద్దితో ఏ విధంగా పోరాడుతుందీ నిరూపించారు. పార్ల‌మెంట్ స‌మావేశాల ప్రారంభ రోజునే వ్యూహాత్మ‌కంగా వామ‌ప‌క్ష నేత‌ల‌తో స‌హా వైసిపి నేత‌లు చేసిన ధ‌ర్నా కేంద్రం దృష్టిని సైతం ఆక‌ర్షించింది. వైసిపి ఢిల్లీ న‌డి వీధుల్లో హోరెత్తించిన ప్ర‌త్యేక హోదా నినాదంతో టిడిపి పూర్తిగా ఆత్మ‌ర‌క్ష‌ణ‌లో ప‌డిపోయింది. ఇక‌, అవిశ్వాస తీర్మానం…రాజీనామాల విష‌యంలోనూ వైసిపి నేత‌లు ఇదే దూకుడుతో ముందుకు వెళ్ల‌నున్నారు

రాజ్య‌స‌భ ఎన్నిక‌ల‌తో వైసిపి ఆట మొద‌లెడుతుందా – YCP Will play the Key Role with Rajya Sabha elections?

0

వైసిపి కి రాజ్య‌స‌భ సీటు ద‌క్కుతుందా. టిడిపి ఎత్తుగ‌డ‌ల‌ను వైసిపి తిప్పికొడుతుందా. టిడిపి అభ్య‌ర్ధుల‌కు బిజెపి మ‌ద్దతు ఇస్తుందా. ఇప్పుడు ఇదే ఏపి పాలిటిక్స్‌లో హాట్ చ‌ర్చ‌. ఇప్ప‌టికే ఏపి నుండి మూడు రాజ్య‌స‌భ సీట్ల కోసం నోటిఫికేష‌న్ విడుద‌లైంది. వైసిపి త‌మ అభ్య‌ర్ధిగా ప్ర‌ముఖ పారిశ్రామిక వేత్త వేమిరెడ్డి ప్ర‌భాక‌ర‌రెడ్డిని ప్ర‌క‌టించింది. టిడిపి మాత్రం త‌మ అభ్య‌ర్ధుల‌ను ఇంకా ఖ‌రారు చేయ‌లేదు. ప్ర‌స్తుతం ఉన్న సంఖ్య‌బ‌లం మేర టిడిపి కి ఇద్ద‌రు..వైసిపి కి ఒక్క‌రు రాజ్య‌స‌భ‌కు అవ‌కాశం ద‌క్కాల్సి ఉంది. కానీ, టిడిపి మూడు స్థానాలు త‌మ ఖాతాలో వేసుకొనే విధంగా పావులు క‌దుపుతోంది. ఒక్కో అభ్య‌ర్ధిని గెల‌వాలంటే 44 మంది ఎమ్మెల్యేల మ‌ద్ద‌తు కావాల్సి ఉంది. సంఖ్య ప‌రంగా చూసుకుంటే టిడిపికి 102 మంది స‌భ్యుల‌తో పాటుగా ఇప్ప‌టికే టిడిపిలో విలీనం అయిన ఇద్ద‌రు స్వ‌తంత్ర అభ్య‌ర్ధుల మ‌ద్ద‌తు ఉంది. ఇక‌, ప్ర‌స్తుతం న‌డుస్తున్న రాజ‌కీయంతో బిజెపికి చెందిన న‌లుగురు టిడిపి అభ్య‌ర్ధికి మద్దతు ఇస్తారా లేదా అనేది సందేహగా మారింది. వైసిపి నుండి టిడిపి లోకి ఫిరాయించిన వారి సంఖ్య 23గా ఉంది. బిజెపి స‌భ్యు ల‌ను మిన‌హాయిస్తే..టిడిపి బ‌లం 127 గా ఉంది. బిజెపి మ‌ద్ద‌తు ఇస్తే అది 131కి పెరుగుతంది.

మూడు రాజ్య‌స‌భ సీట్లు గెల‌వాలం టే టిడిపికి మ‌రో ఎమ్మెల్యే మ‌ద్ద‌తు అవ‌స‌రం. ఇక‌, వైసిపి విష‌యానికి వ‌స్తే ప్ర‌స్తుతం వైసిపి వ‌ద్ద ఉన్న ఎమ్మెల్యేల సంఖ్య 44. ఇది స‌రిగ్గా ఒక రాజ్య‌స‌భ అభ్య‌ర్ధిని గెలిపించుకోవ‌టానికి సరిపోతుంది. అయితే త‌మ‌తో ఇద్ద‌రు వైసిపి ఎమ్మెల్యేలు ట‌చ్‌లో ఉన్నార‌ని టిడిపి నేత‌లు చెబుతున్నారు. ఇదే స‌మ‌యంఓల‌..వైసిపి నుండి టిడిపి లో చేరిన కొంద‌రు ఎమ్మెల్యేలు వైసిపి తో ట‌చ్‌లోకి వ‌చ్చిన ట్లు స‌మాచారం. జిల్లాల వారీగా త‌న‌కు మ‌ద్ద‌తు ఇచ్చే ఎమ్మెల్యేల‌తో స‌మావేశాలు నిర్వ‌హిస్తున్నారు. వైసిపికి చెందిన ఎమ్మెల్యేలను ప్ర‌లోభ‌పెట్టే ప‌నుల‌ను ఇంకా టిడిపి కొన‌సాగిస్తోంది. కానీ, వైసిపి నుండి ఎవ‌రూ వెళ్లే ప‌రిస్థితి క‌నిపించ‌టం లేదు. వైసిపి అంచ‌నా వేస్తున్న‌ట్లుగా టిడిపి శిబిరం నుండి వైసిపికి పోలింగ్ స‌మ‌యంలో మ‌ద్ద‌తు ల‌భిస్తే..అది ఖ‌చ్చితంగా టిడిపికి కోలుకోలేని షాక్ గా మారుతుంది. కేవ‌లం ఒక్క ఎమ్మెల్యే తో ఇప్పుడు రాజ్య‌స‌భ అభ్య‌ర్ధుల జ‌యాప‌జ‌యాలు తారుమారు అయ్యే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి.

వైసిపి నేత‌లు మాత్రం ఖ‌చ్చితంగా తాము త‌మ‌కు ద‌క్కాల్సిన రాజ్య‌స‌భ సీటును ద‌క్కించుకుంటామ‌ని ధీమా వ్య‌క్తం చేస్తోంది. ఇందు కోసం ఈనెల‌7వ తేదీన వైసిపి అభ్య‌ర్ధి నామినేష‌న్ కు ముమూర్తం ఖ‌రారైంది. మ‌రి..టిడిపి ఎత్తుల‌కు పై ఎత్తులు వేస్తున్న వైసిపి..కొత్త వ్యూహాల‌ను అమ‌లు చేస్తోంది. మ‌రి..ఎవ‌రి వ్యూహాలు ఫ‌లిస్తాయో చూడాల్సిందే..