జ‌గ‌న్ అభిమానులు ఇది తెలుసుకోవాల్సిందే – Secret Behind Jagan Success

0
551

200 రోజులుగా జ‌గ‌న్ దిన‌చ‌ర్య ఇదే..
జ‌గ‌న్ లోని క‌మిట్ మెంట్‌చూస్తే..దిమ్మ తిర‌గాల్సిందే..!!

తాను న‌మ్మిన వారి కోసం..త‌న‌ను న‌మ్మిన వారి కోసం..!!
జ‌గ‌న్ పాద‌యాత్ర దిన‌చ‌ర్య చూస్తే ఫ్లాట్ అవ్వాల్సిందే..

జ‌గ‌న్ అభిమానులు ఇది తెలుసుకోవాల్సిందే..!!
జ‌గ‌న్ పాద‌యాత్ర దిన‌చ‌ర్య చూస్తే ఫ్లాన్ కానివారెవ్వ‌రు..!!

జ‌గ‌న్ పాద‌యాత్ర విజ‌య ర‌హ‌స్యం ఏంటి. ఆయ‌న తీసుకొనే ఫుడ్ ఏంటి. ఆరోగ్య ప‌రంగా తీసుకొనే జాగ్ర‌త్త‌లు ఏంటి. పాద యాత్ర‌లో ఆయ‌న రోజువారీ షెడ్యూల్ ఎలా మెయిన్ టెయిన్ చేస్తున్నారు. జ‌గ‌న్ అభిమాని ప్ర‌తీ ఒక్కరికి ఇది తెలుసుకో వాల‌నే ఉత్సుక‌త ఉంది. వారికే కాదు..టిడిపి శ్రేణుల్లోనూ దీని పైనే చ‌ర్చ‌. టిడిపి అధినేత డైట్..యోగా గురించి మ‌ద్ద‌తుగా నిలిచే ప‌త్రిక‌లు ఎంతో ప్ర‌చారం చేసాయి. కానీ, జ‌గ‌న్ 200 రోజులుగా చేస్తున్న పాద‌యాత్ర దాదాపు 2500 కిలో మీట‌ర్ల‌కు చే రింది. ప‌ది జిల్లాల్లో యాత్ర పూర్త‌వుతోంది. పాద‌యాత్ర పూర్తి చేయ‌టం జ‌గ‌న్ వ‌ల‌న సాధ్యం కాద‌ని టిడిపి అనేక విమ‌ర్శ‌లు చేసింది. కానీ, జ‌గ‌న్ మాత్రం త‌న క‌మిట్‌మెంట్ ఏంటో నిరూపిస్తున్నారు. న‌వంబ‌ర్ ఆరున ఇడుపుల‌పాయ‌లో ప్రారంభ‌మై న పాద‌యాత్ర‌..చలికాలం..ఎండాకాలం పూర్తి చేసుకొని వ‌ర్షాకాలంలోకి అడుగు పెట్టింది.

ఇక‌, జ‌గ‌న్ ఈ రెండు వంద‌ల రో జుల పాద‌యాత్ర‌లో ప్ర‌తీ రోజు డ‌స్ట్ ఎల‌ర్జీకి గుర‌వుతూనే ఉన్నారు. కాళ్ల‌కు బొబ్బ‌ల‌తో బాధ ప‌డుతున్నారు. నడుం నొప్పి ఉంటే బెల్ట్ తో నొప్పిని అనిచివేస్తున్నారు. త‌న శారీర‌కంగా ఎదుర‌వుతు న్న ఇబ్బందుల‌ను పంటి బిగువ‌న బిగ‌ప‌ట్టి..పైకి చిరున‌వ్వుతో త‌న వ‌ద్ద‌కు వ‌చ్చిన వారిని స్వ‌చ్చ‌మైన ప్రేమ తో ఆద‌రిస్తున్నారు. జ‌గ‌న్ ప్రేమతో అవ్వ‌ల‌కు ముద్దులు.. చెళ్లెమ్మ‌ల‌కు..మ‌హిళా యువ‌త‌తో సెల్ఫీల‌తో..ఇలా ఎవ‌రినీ డిసప్పాయింట్ చేయ‌టం లేదు. ఎండాక‌లంలో జ‌గ‌న్ వ‌డ‌దె బ్బ‌కు గుర‌య్యారు. కానీ, పాద‌య‌త్ర ఆప‌లేదు. ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా పాద‌యాత్ర స‌మ‌యంలో 103 డిగ్రీల జ్వ‌రం వ‌చ్చిం ది. ఒక్క రోజే రెస్ట్ తీసుకున్నారు. మ‌రుస‌టి రోజు 100 డిగ్రీల జ్వ‌రంతోనే పాద‌యాత్ర ప్రారంభించారు. ఎంత జ్వ‌రం వ‌చ్చి నా కేవ‌లం పారాసిటామ‌ల్ టాబ్లెట్ తో యాత్ర సాగిస్తున్నారు. శ‌రీరం ఎంత అలిసినా..ఎన్ని బాధ‌లు అనిపించినా..యాంటీ బ‌యోటిక్స్ జ‌గ‌న్ వాడ‌టం లేదు.

జ‌గ‌న్ ను రెగ్యుల‌ర్ గా ఓ ప‌ర్స‌న‌ల్ డాక్ట‌ర్ ఫాలో అవుతారు. పాద‌యాత్ర కు విరామం ఇవ్వాల్సి ఉంద‌ని సూచించినా ..జ‌గ‌న్ ప‌ట్టించుకోలేదు. ప్ర‌తీ రోజు న‌డ‌క కార‌ణంగా శ‌రీరం డీహైడ్రేడ్ కాకుండా గ్లూకోజు వాట‌ర్ తీసుకుంటారు. ప్ర‌తీ రోజు దాదాపు 12 కిలో మీట‌ర్లు న‌డ‌క‌..వేలాది మందితో క‌లిసే జ‌గ‌న్..నియోజ‌క‌వ‌ర్గాల స‌మీక్ష‌లు..పార్టీ నేత‌ల‌తో మంత‌నా లు..జిల్లాలో పార్టీ ప‌రిస్థితుల పై సూచ‌న‌లు చేస్తూ..పాద‌యాత్ర సాగిస్తున్నారు. ప్ర‌తీ రోజు ఇవ‌న్నీ పూర్తి చేయ‌టానికి అర్ద రాత్రి వ‌ర‌కు ప‌డుతుంది. కానీ, తిరిగి తెల్ల వారి 4.30 గంట‌ల‌కే నిద్ర లేస్తారు. యోగా..ఏరోబిక్స్‌..ఎక్స‌ర్‌సైజ్ లు చేస్తారు. ఇక‌, ఆహారంలో పూర్తి నియంత్ర‌ణ పాటిస్తున్నారు. నాన్ వెజ్ మానేసారు. ఉద‌యం గ్లాసు జ్యూస్ మాత్ర‌మే తీసుకుంటున్నారు. మ‌ధ్యాహ్నం కొద్దిగా అన్నం..పుల్కాలు..ప‌ప్పు..కూర‌, మ‌జ్జిగ తీసుకుంటారు. రాత్రికి కొద్దిగా అన్నం, రెండు పుల్కా లు, కూర తో లైట్ గానే ముగించేస్తున్నారు. తాను నమ్మిన వారి కోసం..త‌న‌ను న‌మ్ముకున్న వారి కోసం జ‌గ‌న్ ఎప్పుడూ వెనుకాడ‌డు అని చెప్ప‌టానికి 200 రోజులుగా సాగుతున్న ఈ పాద‌యాత్ర లో జ‌గ‌న్ ప్ర‌తీరోజు అనుస‌రించే విధాన‌మే నిద‌ర్శ‌నం. మ‌రి..ఇటువంటి అంకిత‌భావం ఉన్న నేతకు అంత‌గా జ‌నాద‌ర‌ణ ఉండ‌టంలో ప్ర‌త్యేక‌త ఏమీ లేదు. మ‌రి..జ‌గ‌న్ పాద‌యాత్ర‌లో ఆయ‌న దిన‌చ‌ర్య చూసే వారు జ‌గ‌న్ ను అభిమానించ‌క ఉండ‌గ‌ల‌రా.?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here