జగన్ కాబినెట్ లో 5 డిప్యూటీ సీఎం లు వీరే – There are 5 deputy CMs in the Jagan Cabinet

0
486

జగన్ కాబినెట్ లో 5 డిప్యూటీ సీఎం లు వీరే

శుక్రవారం జరిగిన వైఎస్ఆర్‌సీపీ శాసనసభాపక్ష సమావేశంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. క్యాబినెట్‌లో ఐదుగురు డిప్యూటీ ముఖ్యమంత్రులు ఉంటారని జగన్ వెల్లడించిన సంగతి తెలిసిందే. జగన్ ప్రకటన బయటకు రాగానే, రాజకీయ వర్గాల్లో దీనిపై తీవ్ర చర్చ జరుగుతోంది. డిప్యూటీ సీఎంలుగా కాపు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందినవారికి అవకాశం కల్పిస్తున్నట్టు జగన్ ప్రకటించారు. దీంతో జగన్ టీంలో ఉండబోయే డిప్యూటీ సీఎంలు ఎవరనే చర్చ జోరుగా సాగుతోంది. శాసనసభాపక్ష సమావేశంలో పాల్గొన్నవారిలో కొందరు తెలిపిన సమామాచారం ప్రకారం.. కాపు సామాజిక వర్గం నుంచి ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ల నాని, మైనారిటీ కోటాలో కడప ఎమ్మెల్యే అంజాద్ బాషా, ఎస్సీ సామాజిక వర్గం నుంచి ప్రత్తిపాడు ఎమ్మెల్యే మేకతోటి సుచరిత, ఎస్టీ సామాజిక వర్గం నుంచి సాలూరు ఎమ్మెల్యే రాజన్న దొర, బీసీల నుంచి పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారధిలకు డిప్యూటీ ముఖ్యమంత్రి పదవులు దక్కుతాయని తెలుస్తోంది.

సమావేశం ముగిసిన తర్వాత ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఐదు సామాజిక వర్గాల నుంచి ఐదుగుర్ని డిప్యూటీ సీఎంలుగా నియమిస్తామని జగన్‌ స్పష్టం చేసినట్లు తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, కాపు వర్గాల నుంచి డిప్యూటీ సీఎంలు ఉంటారని ఆయన వెల్లడించారు. శుక్రవారం సాయంత్రం 25 మంది మంత్రుల పేర్లు సీఎం జగన్‌ వెల్లడిస్తారని ఆయన తెలిపారు. మరోవైపు క్యాబినెట్‌లో ఎవరికి స్థానం దక్కుతుందోనని ఎమ్మెల్యేల్లో ఉత్కంఠ కొనసాగుతోంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు 50 శాతానికిపైగా మంత్రి పదవులు ఇస్తామని జగన్‌ ప్రకటించడంతో అన్ని వర్గాల్లో సర్వత్రా ఆసక్తి నెలకొంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here